Category తెలంగాణ

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై వాడివేడి చర్చకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.…

హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం

మంటలను ఆర్పివేసిన  ఫైర్‌ సిబ్బంది…తప్పిన ముప్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌ మొదటి అంతస్తు ల్యాబ్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో హాస్పిటల్‌ లోపల దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పిటల్‌ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు. జరిగినది స్వల్ప అగ్ని…

‘హరితనిధి’ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చు

వొచ్చిన ప్రతీ రూపాయికీ పక్కాగా లెక్క   ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం హరితనిధిపై అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : పర్యావరణపరంగా ప్రపంచ వ్యాప్తంగా వొస్తున్న మార్పులు పెనుసవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అటవీ పర్యావరణం,…

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ సవిూక్ష మంత్రులు అందుబాటులో ఉండాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు  సూచన హైదారబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : నేటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్‌ చేసేందుకు, త్వరితగతిన…

పర్యాటక కేంద్రంగా మేడారం అభివృద్ధి

జాతరకు ఏర్పాట్లు పూర్తి శాశ్వత ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి సీతక్క మేడారం జనజాతర సందడి షురూ…కన్నెపల్లిలో గుడిమెలిగే పండగ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : మేడారం జాతర అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క  అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిత్యం…

హైదరాబాద్‌లో కొత్తగా డ్రోన్‌ పోర్ట్‌

డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణ ఇస్రో అధ్వర్యంలోని ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ.తో ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం ముఖ్యమంత్రి రేవంత్‌  రెడ్డితో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, ఎన్‌.ఎస్‌.ఆర్‌.సీ. బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన…

పరిశోధకులకు పనికొచ్చే “మూడు దారులు”

పుస్తక పరిచయ సభలో వక్తలు  విశాఖపట్నం, ఫిబ్రవరి07: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన “మూడు దారులు”… రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు… పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్ గా, రిఫరెన్స్ మెటీరియల్ గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేసారు. విశాఖపట్నం లోని పౌర…

ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్‌ ప్లాన్‌ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీమ్‌ కోర్టులో ఏడుగురు సభ్యులతో…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపి కెసి వేణుగోపాల్‌, సిఎం రేవంత్‌, మల్లు భట్టి  తదితరుల సమక్షంలో చేరిన వెంకటేష్‌ న్యూదిల్లీ, ఫిబ్రవరి 6 :  పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వరుసగా నేతలు బిఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో…