Category తెలంగాణ

బిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18 : బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి,స్థానిక ఎంఎల్ఎ అక్రమాలపై ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు.ప్రభుత్వం పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ వారిని అక్రమంగా అరెస్ట్ లు చేయడం ఎంతవరకు సబబని నాయకులు మూకుమ్మడిగా ప్రశించారు.శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ…

ఘణంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు 

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్18: మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారంనాడుమండల  గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు  బుడగు  బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు…

బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కులకచర్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్18:బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పరిగి నియోజకవర్గ నాయకుడు మారుతి కిరణ్ బూనేటి, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం వెంకటయ్య గౌడ్ లు అన్నారు.శుక్రవారంనాడు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్ అధ్యక్షతన డబుల్ బెడ్ రూమ్…

నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న: బండారి లక్ష్మా రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, దొరల అరాచకాలను, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 373వ జయంతి సందర్భంగా ఈసిఐఎల్ చౌరస్తా లో గౌడ జేఏసి రాష్ట్ర కో కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్…

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల హంగులు సంతరించుకున్న తండాలు

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలు పల్లెల రూపు రేఖలు పూర్తిగా మారిపోయి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. శుక్రవారం యాలాల మండల పరిధిలోని సంగాయిగుట్ట తాండలో 30 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను సర్పంచ్ లలితా భాయ్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.…

సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం 2023-2024 విద్యా సంవత్సరంలో 100 మందికి మైనారిటీలకు ఉచిత కోచింగ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు పారసిలు అభ్యర్థులకు  తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్…

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఆమనగల్ తహసిల్దార్ కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 3016/- లను నిరుద్యోగ భృతి వెంటనే…

ర్యాగింగ్ జోలికెళ్లొద్దు అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18; ర్యాగింగ్ విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.అందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్…

గ్రామాల మధ్య అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18: వివిధ గ్రామాల మధ్య ఇంటర్ లింక్ రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం ఇంద్రేశం చౌరస్తా నుండి బచ్చు గూడెం, చిట్కుల్ మీదుగా ఇస్నాపూర్ జాతీయ రహదారి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నాలుగు కోట్ల…