Category ప్రత్యేక వ్యాసాలు

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం..

నేడు ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు.. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్‌ ‌పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ…

సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు…

వజ్రోత్సవ బంధి

క్రౌర్యానికి బలి అయిన అబలవు నీవు కాఠిన్యానికి కరిగిన సమిధవు నీవు మగవాడి బలవంతపు రతికి బందీవి నీవు విధివిధవను చేస్తే బజారున విసిరిన పిల్లల తల్లివి నీవు ఏది తల్లి నీ జెండా ఈ వజ్రోత్సవపు రహదారుల బారులలో ఈ ఉషోదయాన నిన్ను వెతుక్కుంటూ విషాద నయనాలు ఒత్తుకుంటూ ఏ చీకటి గదుల్లోనో నిన్ను…

విశ్వవిద్యాలయ పట్టాలకు ఉద్యోగాభిషేకాలు ఎన్నటికీ..?

అధికారిక గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 64.7 లక్షల విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందగా, 20 లక్షల యువత పీజీ పట్టాలు పొందారు. డిగ్రీ పొందిన యువతలో సాంప్రదాయ బిఏ, బికాం, బియస్సీ, లా, ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌లాంటి కోర్సులు పొందడం గమనించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు…

వొచ్చే రెండేళ్లకు మరో ‘జుమ్లా ..’

మరో ఇరవై ఐదేళ్లలో పూర్తిస్థాయిలో దేశాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దిల్ల్లీలోని ఎర్రకోటపై నుంచి తన సంకల్పాన్ని ప్రకటించారు. ఏ దేశానికైనా లక్ష్యం ఉండాల్సిందే. లక్ష్యం మేరకు ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే అందుకు తగ్గట్లుగా వ్యూహాలు ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు…

కనీస హక్కులకు నోచుకోని పోలీసు వ్యవస్థ

నేడు బ్రిటీష్‌ ‌పాలనలో తొలి పోలీసు కమిషన్‌ ఏర్పాటు దినం బ్రిటిష్‌ ‌ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ ‌కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ ‌కమీషన్‌ ‌తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, ‌నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలను సేకరించడం, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటం, ఉన్న…

‘‘అజాత శత్రువు అటల్‌ ‌జీ’’ నేడు వాజ్‌ ‌పేయి వర్ధంతి

రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్‌ ‌పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్‌ ‌సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని సైతం గడగడలాడించారు. హీటెక్కించే ప్రసంగాలు…

స్వాతంత్య్ర అమృత్యోత్సవ వేళ గాంధీ విలవల అమలు – ఒక విశ్లేషణ

‘‘‌చాలా కాలం మతసామరస్యం దేశంలో ఫరిడవిల్లింది. దేశ స్వాతంత్య్ర అనంతరం హిందూ ముస్లింల మధ్య జరిగిన అతి భయానకమైన హింస కోణంలో చూస్తే దేశంలో మత ఘర్షణలు విపరీతంగా జరిగి మరో  పాకిస్తాన్‌ ‌లాగా మరో విభజనకు దారి తీస్తుందని భయం ఉండేది. కానీ చాలా కాలం పాలించినటువంటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ముస్లింలకు ఇతర మతస్తులకు…

ఇం‌కా సవాళ్లు అనేకం .. !

దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత 75వ స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మువన్నెల జెండా రెపరెపలాడింది. ఆకాశాన్ని ముదాడుతుందా అన్న రీతిలో త్రివర్ణ పతకాలు ఎగురవేశారు. ప్రజలంతా తమవంతుగా దేశభక్తిని చాటారు. నేతలు కూడా జెండాలు ఆవిష్కరించారు. ఊరేవాడా త్రివర్ణపతాకం ఎగిరింది. ప్రజలు ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొని ఐక్యతను చాటారు. మనమంతా ఒక్కటే అని…