Category Shoba

కథ క్లైమాక్స్ దాటిందని.. !

రేపు వుంటుందో..రేపు వుంటానో అనే భయాంధకారంలో దేశం రాజధాని నడిబొడ్డున పొగమంచులో మనమంతా బ్రతకడమెంటీ? మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ? భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర నియమంగా పాటిస్తూ కనిపించకుండా మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ? రుతుపవనాల గమనాల…

ఎందరు?

జోరు వానలో ఇంటిపట్టునే ఉండగలిగేది ఎందరు? మండుటెండలో నీడ పట్టును సేద తీర గలిగే వారెందరు? ఎముకలు కొరికే చలిలో వెచ్చగా పడుకోగలిగేదెందరు ? కష్టం సుఖం ఇష్టంతో నిమిత్తం లేకుండా భార్య పిల్లలు సుఖం కోసం యంత్రాలతో పోటీపడే వారెందరు? భార్యాపిల్లల సంతోషాలు కోరికలే తన సంతోషాలుగా వారి చిన్ని చిరునవ్వుతో తమ కష్టాన్నంతా…

మాన‌వీయ క‌వితా స్ప‌ర్శ‌…

క‌విత్వంలో  ఎడ‌తెగ‌ని భావ‌ధార ఏ గిరిగీత‌ల‌కు త‌ల‌వంచ‌క ప్ర‌వాహ‌మై సాగితే అద్భుత స‌త్యాల ఆవిష్క‌ర‌ణ‌కు అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అనేకానేక సంవేద‌న‌ల్ని, సంఘ‌ర్ష‌ణ‌ల్ని క‌విత్వీక‌రించ‌డం ద్వారా మ‌నిషి చేసే నిత్య జీవ‌న యుద్ధ‌మెంత భ‌యంక‌ర‌మైందో ఎంతో  స్ప‌ష్టంగా ప్ర‌ముఖ క‌వ‌యిత్రి  మహెజ‌బీన్  ఆకురాలు కాలం  క‌వితాసంపుటిలోని క‌విత‌ల ద్వారా  చెప్పారు. ప్ర‌శ్న‌ల్ని సంధించి, సూటిద‌నంతో ఖ‌రాఖండీగా…

ప్రభాత సూర్యుళ్ళు

ఏ అర్థంకాని తికమకలో ఒక సాలెగూడులో చిక్కినట్టు రేపటి భవిష్యత్తు విద్యార్థి తను కాని తనని తయారుచేసే కల్లోల పోటీ ప్రపంచం నడిబొడ్డుపై ఎటూ కాకుండా బిత్తర చూపులతో… ఎంపీసీ బైపీసీ ఐఐటీ నీట్ లంటూ అవే నీ జీవితమంటూ వెంపర్లాడే తల్లిదండ్రుల కోరికల, చుట్టాలు పక్కాల పోకడల తాళ్ళతో లాగబడి ఆసక్తి అనాసక్తులు ఖాతరు…

మనసు కురిసిన అక్షరాలు…

అలిసిపోయిన బాటల్లో పూలతోటల నీడల విడిదులే కవితలు అని అన్నారో కవి. నిజమే జీవన యానంలో ఒత్తిడుల ఒరిపిడిలో మనిషి కోసం బుట్టెడు మెరుపుల్ని నేసి ఆకాశంపై నీలి గొంగళిని అలంకరించి ఆత్మీయతాసుమాల చినుకుల్ని చల్లి మట్టి పరమళ రాగాల్ని ఆలాపన చేసేది కవిత్వమే. గాయాల రొదల్ని ప్రేమతో నిమిరి భరోసాను పునరావాసమై కవిత్వమే పెంచుతుంది.…

ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు. వోటు అంటే నోటు కాదు ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే ప్యాలెస్లు కూలుతాయి… ప్రజలంటే చులకన కాదు సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు. ఓ ఆచరణ మొదలైతే ఓటమి బటన్‌ నొక్కుతారు ప్రజలంటే  పలుచన కాదు డబ్బుతో కొనుక్కునే పశువులు కారు తమను తాము కాపాడుకునే నిజంతో నడిచే బలంవంతులు……

మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…

ఎరుక మరిచిపోకూడదు …!!

తెలంగాణ నినాదం రక్తంలో పుట్టింనెత్రు ఏరులై పారింది కత్తుల వంతెన మీద నడిచింది కలగనటమంటే రాజ్యంకు శుత్రువుగా మారటమే కోస్తాంధ్ర పెట్టుబడిదారి పాలనలో ప్రజాస్వామ్యం ముక్కలైంది. ఆట పాట మాట బంద్‌ నిప్పుల కొలిమిలో నడిచిన మనుషులు రాష్ట్రాన్ని స్వస్నించారు . ప్రజల హక్కుల కోసమే ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణలోపాలకుల పాశవిక పాలనలో పౌరుని గొంతు…

కలియుగపు గీతాసారాంశమై..!

కాలపరిణామక్రమంలో నాగరికత తన కథను ప్రదర్శించే వింత నాటకంలో మనిషి తన జీవన సంగ్రామంలో ‘‘మిథ్యాసౌందర్యం’’చాటున తన మరణాన్ని మరచి అజ్ఞానాంధకారంలో అయోమ (మా)యసంద్రంలో జీవితమంటే ఏమి అర్థం కాక ఆక్సిజన్‌ అందని కరోనా బాధితుడిలా.. అల్లాడి తల్లడిల్లిపోతున్నాడు. ధర్మం పేరిట అధర్మం అధికారం చెలాయిస్తూ రాజ్యమేలుతున్నప్పుడు ‘‘నేను మళ్ళీ పుడతానని’’ ఆనాడే చెప్పిన పరమాత్ముడు..…