Category సాహిత్యం-శోభ

లవ్!

‘నిన్ను నువ్వు యెప్పుడైనా అద్దంలో చూసుకున్నావానే?’ ‘ఊ… నాకేం తక్కువ?’ ‘బంగారం బొమ్మలా వుంటావు కదనే?’ ‘యా…’ ‘మరి గా కోతిగాడికి యెట్ల పడినావే?’ ‘మన పూర్వీకులనంటే మంచిగుండదు!’ ‘చాల్లే, గా బద్మాష్‌గాడు నీకెట్ల నచ్చిండే?’ ‘బద్మాష్‌గాడు కాబట్టి…’ ‘నవ్వకు, గాడు నీకు నచ్చనీకి నాలుగు కారణాలు జెప్పే?’ ‘పైసలుండి కూడా లేనోళ్లని ఫీల్‌ గానీకుండా…

జాజులు నవ్విన రాత్రి

జాజులు నవ్విన ఏ జావళీల జానపదుల్లో నిన్ను వెతుక్కొంటూ వేణుగానమై రవళిస్తుంటాను పవళించే నీ ఊహల రాత్రుల్లో వెండి వెన్నెల రంగుల కలల్ని నెమరేస్తూ నెమ్మదిగా నన్ను నేను మైమరచిపోతాను జాగురూకతో జాబిలి రాత్రుల్ని నీకై అన్వేషణ సాగిస్తాను మంద్రంగా మీటే మిణుగురు రాగాల్ని వింటూ నీ కోసం సాహిత్య చకోరినై ఏ గగన తీరాన్నో…

దాశరథి ‘సమైక్య’ కవిత

తెలుగు కవిత్వానికి అంగారాన్ని, శృంగారాన్ని అద్దిన దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987) శతజయంతి సంవత్సరం ఇది. నూరువసంతాల కింద పుట్టిన దాశరథి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని(1946-1951) అగ్నికంఠంతో అక్షరీకరించాడు. బతికినంత కాలం తెలంగాణ కోసం ఒళ్ళంతా నోరుజేసుకొని కొట్లాడాడు. సినిమాలకు పాటలు రాసి రసహృదయుల మనస్సులను చూరగొన్నాడు. ‘నిప్పుపూలు’లాంటి తెలంగాణ ఆత్మను పట్టిచూపే కథలు కూడా…

తెలంగాణ సమరబోధి

‘మేకిట్‌ న్యూ’ అనే పిలుపునిచ్చాడు ఎజ్రాపౌండ్‌. ఈ  పిలుపు అనేకచోట్ల, అనేకవిధాలుగా సాహిత్యంలో ప్రతిఫలించింది ఆధునిక ఉద్యమమైంది. గతంతో తెగదెంపులు చేసుకుంది. పాత సాంప్రదాయలను వదిలి పెట్టమని ఉద్బోధించింది. కొత్తరూపాలను ఆవిష్కరించింది. కవులను, కళాకారులను నూతన పద్ధతులను, కొత్తపుంతలను అనుసరించేట్లు చేసింది. మహాకవి దాశరధి కూడా ‘పునర్నవం’ అని పిలుపునిచ్చాడు. తెలుగు కవులు ఏ మేరకు…

నూరేళ్ల దాశరధి

తెలుగు, తెలంగాణ సమాజ సాహిత్యాల మీద చెరగని ముద్ర వేసిన దాశరధి కృష్ణమాచార్యుల శత జయంతి 22 జూలై 2025. ఈ సందర్భంగా దాశరధి కృషిని స్మరించుకుంటూ దాశరధి ప్రత్యేక సాహిత్య పేజీని పాఠకుల ముందుకు తీసుకు వస్తున్నాం. -శోభ టీమ్‌

నట రత్నాలు

‘సార్ మీరు కాల్ చేసినప్పుడు యిందాక వాష్ రూమ్ లో వున్నా సార్, సారీ సార్ లూజ్ మోషన్స్, ఫోను తియ్యొస్తలేదు, మాటాడొస్తలేదు.’ అని రొప్పుతూ చుట్టూ చూసిన జీన్స్‌గాడు ‘ప్రామిస్ సార్, నా ఫోను డెడ్ అయింది సార్ లేకపోతే వీడియో కాల్ చేసేవాణ్ణి సార్ అందుకే నా పక్క పేషెంట్ ఫోన్ తీసుకొని……

ముద్ర

అచ్చు కాయిదం కింద దాగిన అక్షరాలు ఒకే తీరుగా రాలిపడ్డట్టుగ సాదృశ్యాలు తెల్లారేసరికి  తీగ మల్లె చెట్టుకు పూసిన తెల్లని పూలన్నీ  ఏకరీతి పరిమళం మూలాలన్నీ ఒకటే వాటి కణాలు వేరువేరు జన్యుపటం ఒకటే సంస్కృతీ ఒక్కటే ముద్రలన్నీ ఒకే స్వభావ ఆకృతులు **** ఆ కనురెప్పల సుతి మెత్తని కదలికల్లోనో సుకుమార నవ్వుల పలు…

పసగాడ సన్యాసి

సాహిత్యాన్ని జానపదుల దరి చేర్చిన  ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సాహిత్యకారుడు పసగాడ సన్యాసి. పండితులకు మాత్రమే పరిమితమైన సంస్కృతభూయిష్ట తెలుగును కాదని జానపదులు హాయిగా పాడుకునే విధంగా ‘పదములు’ రాసిన సాహితీ సంపన్నుడు. విషయం పౌరాణికమే అయినా అది పామరులకు హృదయంలో నాటుకునే విధంగా చెప్పిండు. విజయనగరం జిల్లా దేవునూరు తాలూకా…

అడివి కంటి ఎర్ర జీర

అలిష్టపడ్డ కంటిపాపలు రెండూ గాఢంగా కావలించుకునే ఆళ్లకు అదాల్లునొచ్చిన నీ రూపం ఆ రెండిటిని కలుసుకొనిత్తలేదు నాకిప్పుడూ రోజూ ఇదే తంతు దోస్త్ ఎప్పుడన్నా బలిమీటికి కంటిపాపలను కలిపి కాసింత కునుకు తీస్తున్నప్పుడు లీలగా నీ రూపం  కదలాడుతుంది తలుపులేశున్న ఇంటిముంగట అటీటూ తిరుగుతూ నన్నాటకెట్టా బైటికి రప్పియాల్నో తెల్శిన సాయితగాని లెక్కనే అలుముకున్న కంటిపాపల…