Category ఎడిటోరియల్

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ లో జోష్‌ ..!

తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ‌తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్‌కు ఆ అవకాశం…

ఇం‌తకూ ఏ రెండు పార్టీలు ఒక్కటిగా ఉన్నట్లో !!

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ  రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం రాష్ట్రంలో రాజకీయ వేడి రాచుకుంటోంది. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈ మూడు పార్టీలుకూడా ఒకదానిపైన ఒకటి నిందారోపణలు చేసుకుంటూ ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన…

ఆ ‌ముప్పై సీట్లు…?

తెలంగాణలో రానున్న ఎన్నికల విషయానికొస్తే ప్రధానంగా ముప్పై శాసనసభ స్థానాలపై ఇటీవల రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలుండగా కేవలం ముప్పై స్థానాలగురించే రాజకీయ పార్టీలు ఎందుకు ప్రస్తావిస్తున్నాయన్న ప్రశ్న ఉద్భవించకపోదు. ఈసారి వంద స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్‌ ‌సాధిస్తామని అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌ప్రకటిస్తున్నది. అందుకు కావల్సిన ప్రణాళికలను…

ఆకాశం వైపు చూస్తున్న రైతులు

ప్రతీ ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలవల్ల కాస్తు కాలాన్ని ఒక నెల ముందుకు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. అది వేసవి అయినా వర్షాకాల పంటలైన ఏదో కారణంగా రైతు ఆరుగాల కష్టాన్ని పుట్టి ముంచుతున్నాయి. అనుకోని తుఫాన్‌ ‌వల్ల లేదా అతి వర్షాలు, వర్షాలు ఆలస్యంగా పడడం ఏదైనప్పటికీ…

‘‌తెలంగాణ’కు దర్వాజ ఖమ్మం

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా అత్యంత కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న రాజకీయ పార్టీలన్నిటికీ ఖమ్మం వేదికగా మారింది. తెలంగాణపై ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న పార్టీలన్నీ ఖమ్మంనే తమ ప్రధాన కేంద్రంగా చేసుకుంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికల కోసం చాలాకాలం ముందునుండే సమాయత్తమవుతున్న జాతీయ,…

బిజేపిలో ఈటల ఒంటరవుతున్నాడా !

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ,  ‌బిజెపి చేర్పుల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఒం‌టరి వాడవుతున్నాడా అంటే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో సమానంగా పోరాటంచేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. పోరాటంలో ఏర్పడిన ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో సంయమనంపాటిస్తూ,…

వొచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిది ..?

రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజేతలెవరన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకుల చూపు కూడా తెలంగాణపై ఉంది. తొమ్మిదేళ్ళ కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నట్లుగా ప్రభుత్వం అందుకుంటున్న ప్రశంసల వల్ల…

కొత్త పార్టీకి దారి తీస్తున్న గెహ్లెట్‌, ‌పైలెట్‌ ‌వివాదం

రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లెట్‌, ఆ ‌రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలెట్‌ ‌మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న రాజకీయ విభేదాలు ఆఖరికి అక్కడ మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించేందుకు దారి తీసింది. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్ళుగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ పోరు పొందుగా మారకపోవడంతో ఈ నెల 11వ…