Category శీర్షికలు

విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి?

నేడు  ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోలీస్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టిన దినం 1792లో డిసెంబర్‌ 7వ తేదీన భారత  దేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం,17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ కమీషన్‌ తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, నాడు…

మధిరలో చరిత్ర సృష్టించిన ‘భట్టి’…అందరివాడు..!

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు.  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి రికార్డు నెలకొల్పారు భట్టి విక్రమార్క. మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి…

ప్రతి పౌరునికి సమన్యాయం జరగాలి

రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు.…

రాజకీయాలలో రాటుదేలి అధికారపీఠంపై రేవంత్‌

సమర్థత ఉన్న వ్యక్తినే పదవులు వరిస్తాయని స్వల్పకాలంలోనే రుజువు చేసారు. సమర్థత ఉంది కాబట్టే రేవంత్‌ రెడ్డిని పదవులు వరిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల సమయంలో తన సమర్థత ప్రదర్శించే తెలంగాణలో అట్టడుగున ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలో నడిపించారని  బలమైన వాదన వినిపిస్తున్నది. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే కేసీఆర్‌ ను…

రేవంత్‌ ముందుచూపు కల్సి వొచ్చింది ..!

దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను…

బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమా …

పదేళ్ళ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు.…

డ్రోన్‌ టెక్నాలజీ భారతదేశంలోని వ్యవసాయ రంగానికి గేమ్‌-ఛేంజర్‌!

పురుగులు లేదా జంతువులు కాటు వంటి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో, డ్రోన్లు హరిత సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతో కలిపి ఈ ఇబ్బందులను నివారించడంలో రైతులకు సహాయపడతాయి. పంట ఆరోగ్యం, పెరుగుదల మరియు దిగుబడిపై సమాచారాన్ని అందించగలవు. ఇది రైతులు సమస్యలను ముందుగానే గుర్తించి, తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సహాయపడుతుంది.…

‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’

నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…

ఎన్నికల రణంలో భారాస ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణం

ఇందిరాగాంధీని  పోలి ఉండడంతో,‘‘అచ్చం ఇందిరాగాంధీని చూస్తున్నట్లే ఉంది’’అని, భావించి ఆమె కష్టానికి ఫలితం ఇచ్చారు.  రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టి సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే భావన కూడా తోడైంది.   కర్ణాటక  ఎన్నికల్లో మాదిరి తెలంగాణ ఎన్నికల్లో  ఆమె  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాంగ్రెస్‌ను…