Category శీర్షికలు

మైండ్‌ గేమ్‌ రాజకీయాలు !

తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్‌ కు ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరం. ఇప్పుడున్న అంచనాల మేరకు ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు. అయితే కనీసం ఓ నాలుగైదు ఎంపి సీట్లు గెలిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే ఇప్పటికే అనేకమంది బిఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు.…

ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా సివిల్‌ సర్వెంట్స్‌ సేవలు!

రేపు జాతీయ పౌర సేవకుల దినోత్సవం (నేషనల్‌ సివిల్‌ సర్వెంట్స్‌ డే) సందర్భంగా… భారత ప్రభుత్వంలో ప్రధాన విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులు లేదా సివిల్‌ సర్వెంట్స్‌ ‘‘స్టీల్‌ ఫ్రేమ్‌ ఆఫ్‌ ఇండియా’’ అంటూ 21 ఏప్రిల్‌ 1947న స్వతంత్ర భారతంలో తొలిసారి పౌర సేవకులను ఉద్దేశించి భారత ప్రథమ హోమ్‌ మినిస్టర్‌ సర్దార్‌ వల్లబ్‌…

రైతుల చుట్టూ రాజకీయం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సుమారు కోటికి పైగా ఉన్న రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రైతుల మీద, వ్యవసాయ రంగంపైన వల్లమాలిన అభిమానాన్ని కనబరుస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలు ముందు…

ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన బీజేపీ

డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌ చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైన చేయడానికి సిద్దపడినా మార్కెట్‌లో ఉపాధి లభించని స్థితి నెలకొంది.  కార్మికశక్తిలో ఉపాధి పొందుతున్న వారు (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌) దేశంలో 2016-17లో 46.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరాల్లో  శ్రమశక్తి ఉపాధి పట్టణ ప్రాంతాల్లో 44.7…

పిల్లి శాపనార్థాలు…

కెసిఆర్‌తో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు కూడా శాపనార్థాలకు అలవాటు పడ్డారు. గత పదేళ్లుగా రాజ్యం అనుభవించిన వారు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. అధికారం పోయిందన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ అంతా ఆగం అయిపోయిందన్న రీతిలో గగ్గోలు పెడుతు న్నారు.  వారు లేకుంటే రాష్ట్రం  అతలాకుతలం అవుతుందనీ, అభివృద్ది ఆగిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ…

దునియా అంత యుద్ధమయమేనా…?

ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా…? ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి, నిలకడగా ఉండలేక పోతున్నాయి, ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని ఆలోచిస్తున్నాయి. ఎందుకు దీనికి కారణం.. ఆయుధ పోటీనేనా…? లేక అగ్రరాజ్యాలు తెర వెనుకనుండి…

తెలంగాణలో భూదానోద్యమం …

ఆచార్య వినోబాభావే భూదాన్‌ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యం.. ఆచార్య వినోభాభావే, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిం దని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు.  భారతదేశ…

దేశ సమస్యలపై స్పష్టమైన హామీ ఏదీ?

దేశంలో మళ్లీ తమదే అధికారమని బిజెపి ఘంటాపథంగా చెబుతుంది. ఎన్‌డిఎ 400 సీట్లు సాధిస్తుందన్న ధీమాలో ఉంది. కాంగ్రెస్‌ తమకు పోటీ కాదని, ఇండియా కూటమికి ప్రజల అండలేదని ప్రచారం చేసుకుంటుంది. ఈ క్రమంలో బిజెపి పదేళ్ల పాలనను గీటురాయిగా తీసుకుంటే..అనేక విషయాలు చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా పెట్రో, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. జిఎస్టీ…

వారసత్వంగా వొచ్చే వ్యాధి..

నేడు ప్రపంచ హిమోఫిలియా దినం ఫ్రాంక్‌ ష్నాబెల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ హిమోఫీలియా (డబ్లు ఎఫ్‌ హెచ్‌ ) ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 1989 సంవత్సరం నుండి జరుపితున్నారు. ఈ సంవత్సరం  థీమ్‌ ‘‘అందరికీ సమానమైన అందుబాటు: అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించడం’’.వరల్డ్‌…