Category శీర్షికలు

వోటింగ్‌పై ఆసక్తి చూపని గ్రేటర్‌ వోటర్లు!

ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల లోక్‌ సభ సెగ్మెంట్ల పరిధిలో వోటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. సికింద్రాబాద్‌ మరియు హైదరాబాదులోని నియోజకవర్గాల్లో యాభై శాతం వోటింగ్‌ కూడా నమోదు కాలేదు. మల్కాజిగిరి, చేవెళ్లలో మాత్రం  50 శాతం దాటింది.  గ్రేటర్‌ సిటీ పరిధిలోని…

ప్రైవేటు విద్యా…అంతా మిధ్యా..!

నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది పాఠశాలలే. కానీ అలాంటి పాఠశాలలే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల  భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూల్ లు ప్రారంభం కానున్నాయి . దోపిడి మొదలైంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్ కు సపరేట్…

డ్రైనేజి నాలా అభివృద్ధి వ్యవస్థ పటిష్టపరచాలి

హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్లో భవిష్యత్తులో వరదలను నివారించడానికి  తగ్గించడానికి,  నష్టాలను తగ్గించడానికి, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలి. హైదరాబాద్‌లోని ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగం భారీ వర్షాలు  పట్టణ వరదల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో సమగ్ర మురికి నీటి పారుదల వ్యవస్థను ప్లాన్…

విద్యాహక్కు పరిరక్షణ అందరి బాధ్యత!

విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను అధికంగా  తయారు చేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల…

గురి తప్పుతున్న వోటు అస్త్రం!

ప్రజాస్వామ్యం ప్రజల పాలిట వరం. కాని ఈ విషయం ఎందరికి అవగతమవుతుంది? ఎండలో తిరిగితేనే నీడ విలువ తెలుస్తుంది. కష్టాలు అనుభవిస్తేనే నిజమైన సుఖం అంటే ఏమిటో స్ఫురణకు వస్తుంది. కొన్ని దేశాల్లో కొనసాగుతున్న అప్రకటిత నియంతృత్వం, మరికొన్ని దేశాల ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నియంతృత్వ వ్యవస్థల చేదు అనుభవం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనుభవిస్తున్న ప్రజలంతా…

 బీజేపీలో ఏకస్వామ్యం .. !

ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. నాలుగు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటికే 270 సీట్లు సాధించామన్న ధీమాను హోంమంత్రి అమిత్‌ షా చెప్పుకొచ్చారు. తమ లక్ష్యం 400 సీట్లు కావడంతో మిగతా మూడు దశల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే 75 ఏళ్ల వయో పరిమితి మోదికి  వర్తించదని కూడా చెప్పేశారు. మోదికి  వయసుతో నిమిత్తం…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పట్టణ వోటరు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి వోటర్లు  మరోసారి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేశారు. వోటర్లను ఆకట్టుకునేందుకు నెలల తరబడి అవగాహన కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు సోమవారం పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాల్లో వోటర్లకు దిశానిర్దేశం చేసేందుకు  స్టాళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్‌ చాలా పోలింగ్‌ స్టేషన్లలో  రాజకీయ పార్టీ…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం!

నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది బంధువుల  సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు.  భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందు…

‘‘కుటుంబముతో కలిసి ఉందాం…… కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం’’

  అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 15న విశ్వ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుచున్నప్పటికి, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం,ఉమ్మడి కుటుంబాల అవసరము గురించి వివరించడం కొరకు ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. పూర్వకాలంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు.…