సుఖసంతోషాలతో జీవించాలి…

బీ ఆర్ ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనసంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్31: నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్  శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. నూతన సంవత్సరం లో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *