2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పైన నిర్బంధం కొనసాగిస్తున్నప్పుడు పాడుకున్న పాట… “పాలన ఏం పాలన ఫాసిస్టు పాలన..కాంగిరేసు పాలన కసాయి మూకల పాలన…” ఈ పాట ఇప్పుడు 2025లో మళ్ళీ అదే కాంగ్రెస్ సర్కారులో పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల్లో తేడా ఏమీదనేది స్పష్టంగా కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికరంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిస్టు పోకడలు, మతోన్మాదం, నిర్బంధం తీవ్రతరం అయ్యాయి. ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు పని చేసే పరిస్థితులు లేక కారు మబ్బులు కమ్ముకుని చీకట్లు ముసురుకుంటున్న సమయంలో బీజేపీని ఎదురుకోవడానికి మధ్యంతర మార్గంగా కాంగ్రెస్ పార్టీకి అనేకమంది ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, బుద్ధిజీవులు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దత్తు తెలిపి అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు, మానిఫెస్టోలో పెట్టని 7వ ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ, 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. సహజంగానే మనిషి ఆశాజీవి. కెసిఆర్ ప్రభుత్వంలో కన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు మరింత ఎక్కువ లబ్ది జరుగుతుందనే…