prajatantra_news

prajatantra_news

jobs: ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్‌ ‌మోసం

– నిలదీస్తారనే భయంతో విద్యార్థుల అరెస్ట్ ‌- సిఎం ఓయూ పర్యటనపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు.  విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ…

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ ట్రాలీని కాంటర్‌ ట్రక్‌ ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.…

Education: విద్య ద్వారానే ప్రపంచంతో పోటీపడగలం

– విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్‌ను…

Urea : రాష్ట్రం ఒత్తిడితో యూరియా మంజూరు

– డిమాండ్‌కనుగుణంగా జిల్లాలకు పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ వారం రోజులలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా విడుదలైందని వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండుకనుగుణంగా…

‘Vatsalya‘: ‘మిషన్‌ వాత్సల్య’ కింద ఆర్థిక సాయం

~ గాయపడిన బాలుడి కుటుంబ ఖాతాలో జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పుష్ప సినిమా బెనిఫిట్‌ షోలో గాయపడిన బాలుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో గాయపడిన బాలుడి అక్కకు చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట…

OU : తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ

– కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అని, తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని (twins) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి…

ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ

– సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌సు్ట 24: తెలంగాణ రాష్ట్రాన్ని బయోడిజైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ఆసియా పసిఫిక్‌ బయో డిజైన్‌ ఇన్నొవేషన్‌ సమ్మిట్‌ 2025ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఇన్నోవేషన్‌ ఆఫ్‌ భారత్‌ –…

ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యమని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. గోల్నాకలోని జిందా తిలిస్మాత్‌ రోడ్డులో ఫ్రెండ్స్‌ ఫిట్‌నెస్‌ వరల్డ్‌ జిమ్‌ను ఆయన అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే…

ముగిసిన సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమ యాత్ర

– గాంధీ మెడికల్‌ కళాశాలకు పార్థివ దేహం అప్పగింత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. మగ్దుమ్‌ భవన్‌ నుండి సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీ వరకు ఊరేగింపు నిర్వహించగా కుటుంబ సభ్యులు…

ఘనంగా ఆబోప అవార్డుల ప్రదానోత్సవం

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆల్‌ బ్రాహ్మిణ్‌ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌, వరంగల్‌(ఆబోప) ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, నృత్య పురస్కార ప్రదానోత్సవ సభ భీమారంలోని అగస్త్య బ్రాహ్మణ భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. మోత్కూరు మనోహర్‌ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం విశ్రాంత ఆచార్యులు…