ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో బోధనాభ్యసన సామర్థ్యాల పెంపుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేబూనటం ఆహ్వానించతగినదే!కానీ వాటి అమలుకోసం రూపొందించిన కార్యాచరణ లలో లోపాలను సవరించుకోవల్సివుంది. విద్యార్థుల విద్యా సంక్షేమం కోసం రూపొందించి , అమలు చేసే కార్యక్రమాల లక్ష్యాలు ఉన్నతమైనవే కానీ అవి బడులను క్యాలెండర్ సమయాన్ని గందరగోళ పరిచేది కాకూడదు.లిఎల్.ఐ.పిలి కార్యాచరణ ప్రణాళిక క్షేత్ర స్థాయి ఆచరణలో ప్రయివేట్ శక్తుల భాగస్వామ్యం , ప్రభుత్వ ఉపాధ్యాయులను అనుమానించేదిగా, అవమానించేదిగా వుండటం పై ఉపాధ్యాయుల, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. మూడేసి , నాలుగేసి కార్యక్రమాలు ఒకేసారి విద్యా సంవత్సరం ఆరంభంలోనే హడావుడి గా అమలు చేయటం మూలానా ఆ కార్యక్రమాలు మొక్కుబడి వ్యవహారంగా మారి అభాసు పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవల్సివుంది.
ప్రభుత్వం ఆగస్ట్ లో ఉన్నత పాఠశాలల్లో నిర్వహించబోయే లిలెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’లి (ఎల్ఐపీ) ఉపాధ్యాయుల బోధనానుభవాన్ని, విషయపరిజ్ఞానాన్
వీటి ఆధారంగానే తరగతి బోధనాభ్యసనలను ఉపాధ్యాయులందరూ చేపట్టాలనే ఆ శిక్షణ ఉద్దేశాలు ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నాయో ఆమలు క్రమంలో అవగతం అవుతాయి.
లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం
6 నుంచి 9 తరగతుల విద్యార్థులలో కనీస సామర్థ్యాల సాధనకు బోధనలో ప్రమాణాల పెంపు లక్ష్యంగా ‘లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’ (ఎల్ఐపీ)ను ఆగస్టులో ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఇందు కోసం జూలైలో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.తరగతి గది బోధనను మెరుగుపర్చడం, విద్యార్థులు నిర్ధేశించిన వారి భాషల్లో చదవడం,రాయడంతో పాటు టీచర్లలో.బోధనా. సామర్థ్యాలను పెంచడం (టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్) వంటి అంశాలపై దృష్టిసారించారు.ఏం చదివారో,ఏం నేర్చుకున్నారో చెప్పలేని పరిస్థితుల నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు ఈ కార్యక్రమం ద్వారా విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ, ఆస్కీ, సేవ్ ది చిల్డ్రన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు.కార్యక్రమ నిర్వహణ అమలు ఇలా..
తొలుత విద్యార్థులకు బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దీని ఆధారంగా విద్యార్థుల ప్రగతి అంచనా వేస్తారు.టీచర్లుపాఠాలు ఎలా చెబుతున్నారో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి పర్యవేక్షణ చేస్తారు.టీచర్ల బోధనాభ్యసనలలో లోపాలను ఎత్తిచూపకుండా నిర్మాణాత్మక సూచనలు,ఆయా లోపాలు అధిగమించేందుకు కావాల్సిన మద్దతును అందజేస్తారు.ముద్రించిన పాఠ్యప్రణాళికలను టీచర్లందరికీ అందజేయాలని, ఆ ప్రణాళికల ప్రకారమే పాఠాలు టీచర్లు బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు టీచర్లు సొంతంగా తయారుచేసిన పాఠ్యప్రణాళికలు నాణ్యంగా ఉండటం లేదని ప్రభుత్వం అభిప్రాయ పడుతుంది.ఈ నేపథ్యంలోనే అన్నిరకాల ప్రమాణాలను పాటిస్తూ.ఎస్.సి.ఇ.ఆర్.టి ఈ పాఠ్యప్రణాళికలను రూపొందించినట్టు తెలిపింది.
అమలు లోపాల సంగతేమిటి ?
ఎస్.సి.ఇ.ఆర్.టి.ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ సిద్దం చేసేప్పుడు తరగతి బోధనాభ్యసనలు,పాఠ్యాంశ ,సహ పాఠ్యాంశ,మూల్యాంకనాలకు తగు సమయాలను,తేదీలను కేటాయిస్తుంది. వివిధ కార్యక్రమాల నిర్వహణ, వివిధ శిక్షణల కోసం సమయాన్ని కేటాయించదు. జూన్ లో విద్యా దినోత్సవం, జులైలో పఠనోత్సవం,ఆగస్ట్ లో లిలిప్లి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఎంపిక చేసిన మూడు జిల్లాలు వరంగల్,ఖమ్మం ,ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎస్సి,ఎస్టి ,విద్యార్థుల కోసం లిఎకడమిక్ ఎన్రీచ్ మెంట్ డ్రైవ్లి కార్యక్రమం అమలు చేయబోతున్నది.ఈ కార్యక్రమాలపై సి.ఆర్.పి. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు క్లస్టర్ పరిధిలోని పాఠశాలల సందర్శన , మండల విద్యాధికారి, జిల్లా పరిశీలన బృందాలు వీరి సందర్శన సందర్భాల్లో తరగతి బోధనా భ్యసనలు క్యాలెండర్ షెడ్యూల్ బదులు అన్ షెడ్యూల్ వైపు మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 20 వేలకు ఫై చిలుకు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ వున్నాయి. పర్యవేక్షకాధికారులు,
– అజయ్
ఉపాధ్యక్షుడు.టి.పి.టి.ఎఫ్.
ఉపాధ్యాయదర్శిని, టి.పి.టి.ఎఫ్.అధికార.మాసపత్రిక