NEWS

NEWS

తెలంగాణను తాకిన నైరుతి.. అక్కడక్కడా వర్షాలు జంట నగరాల్లోనూ చిరు జిల్లులు

హైదరాబాద్‌, ‌ప్రజాంత్ర, జూన్‌ 14 : ‌రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోకి ప్రవేశించాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు, ఆ తర్వాతి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో కూడా సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు…

సిఎం కేసీఆర్‌ ‌నమ్మదగ్గ మనిషి కాదు

పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధిపేటలో ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఈటల రాజేందర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14: ‌టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నమ్మదగ్గ మనిషి కాదనీ బిజెపి నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు.…

హుస్నాబాద్‌ ‌రణరంగం

పరిహారం కోసం భూ నిర్వాసితుల ధర్నా పోటీగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన గౌరవెల్లి భూ నిర్వాసితులకు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు మధ్య రగడ ఎమ్మెల్యే కాంపు ఆఫీస్‌ ‌దగ్గర పోటాపోటీ నిరసనలు భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి పోలీసులు, ప్రజలు పరస్పరం దాడులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.…

రాజకీయ ప్రయోజాల కోసమే ఇడి కేసులు

బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టాల్సిందే కుట్రలు బయటపడతాయనే భయంతోనే కేసులు నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికతో బండారం బయట పడుతుందన్న భయం కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ పెరగడంతో మోడీ ద్వయం కుట్రరాజకీయాలు ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ‌ధర్నాలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టిల విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రాజకీయ…

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు

పలువురు సిఎంలు, నేతలకు ఆహ్వానం తెరపైకి శరద్‌ ‌పవార్‌ ‌పేరు.. అంతలోనే తాను బరిలో లేనంటూ పవార్‌ ‌స్పష్టీకరణ న్యూ దిల్లీ/ముంబై, జూన్‌ 14 : ‌రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు నేడు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు.…

ఆసిఫ్‌నగర్‌ ‌ఘటన ఎంత అవమానకరం దీనిని ఇలాగే వొదిలద్దామా: రేవంత్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ఆసిఫ్‌నగర్‌ ‌ఘటనపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు. పోలీస్‌ ‌వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం దృశ్యాన్ని ఆయన ట్విటర్‌లో షేర్‌ ‌చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్‌లోనేనని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై.. దాడులు చేసే స్థాయికి పరిస్థితి వొచ్చిందని ట్వీట్‌లో…

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి..యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని…

రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడితే సమాజం తిరగబడతది

బిజెపి నేతలు ఏం ముఖం పెట్టుకుని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో తిరుగుతున్నారు… కేంద్రం, బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది గజ్వేల్‌ ఏఎం‌సి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌న్యాయబద్దంగా కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ ‌నిధులు విడుదల చేయకుండా…

రెండో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఎఐసిసి కార్యాలయం వద్ద భారీగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు పోలీసులుతో వాగ్వాదం..పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరింపు న్యూ దిల్లీ, జూన్‌ 14 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగింది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌కు…

భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం…