“గద్దర్ జీవితం ఆయన కళలా పోరాటం, ధైర్యంతో నిండి ఉంది. 1997లో హత్యాయత్నం నుంచి బయటపడి, తన శరీరంలో బుల్లెట్తో జీవించారు. 2004లో ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించారు. వివిధ సిద్ధాంతాల మధ్య ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం గ్రామీణ ప్రజల నుంచి పట్టణ పేదల వరకు విస్తరించింది..”
డా. జి.వి. వెన్నెల గద్దర్,
ఛైర్పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి
ఏప్రిల్ 6, 1997, అప్పుడు నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించిన ఒక సంచలన ఘటనలో విప్లవ గాయకుడు గద్దర్ పై హైదరాబాద్ అల్వాల్లోని ఆయన నివాసంలో హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో గద్దర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరంలో పలుచోట్ల బుల్లెట్లు తగిలాయి; వాటిలో ఒకటి వెన్నెముకలో మిగిలిపోవడం, “రాజ్య అణచివేతకు ప్రతీకగా మారింది.ఈ దాడి రాజకీయ ప్రేరణతో జరిగిందని విస్తృతంగా నమ్ముతారు. ప్రభుత్వ మద్దతుతో పనిచేసే శక్తులు “గ్రీన్ టైగర్స్” అనే పోలీస్ విభాగం ఈ ఘటనకు కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సామాజికంగా అణగారిన వర్గాల బాధలను ప్రతిబింబించే గద్దర్ పాటలు ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు నిషేధిత పీపుల్స్ వార్ గ్రూప్ కు ఆయన మద్దతు ఉండటం, అలాగే ఎన్కౌంటర్ అమరవీరుల శవాల స్వాధీన కమిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్లడం వల్ల ఆయన లక్ష్యంగా మారినట్లు భావించారు.
రాజకీయ నేపథ్యం మరియు ఉద్దేశం
ఈ ఘటన తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగింది. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమాలు వారి సానుభూతి పరులు, పౌర ప్రజా సంఘాల పై తీవ్రంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబడ్డాయి. గద్దర్ పాటలు విప్లవ ఆలోచనలకు ప్రజలను ఆకర్షించడంతో ఆయనను ఒక ప్రమాదంగా భావించారు. గద్దర్పై పలుమార్లు కాల్పులు జరగగా, వైద్యులు కొన్ని బుల్లెట్లను తొలగించగలిగినా ఒకటి ప్రమాదకర పరిస్థితుల వల్ల అలాగే మిగిలిపోయింది. తీవ్ర గాయాలున్నప్పటికీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ కేసును “అన్డిటెక్టెడ్”గా నమోదు చేయడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ హత్యాయత్నం మేధావులు, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. వందలాది కవులు, రచయితలు, కళాకారులు ఈ ఘటనను ఖండిస్తూ పాటలు, కవితలు, వ్యాసాలు రాశారు.
ఈ ఘటన తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగింది. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమాలు వారి సానుభూతి పరులు, పౌర ప్రజా సంఘాల పై తీవ్రంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబడ్డాయి. గద్దర్ పాటలు విప్లవ ఆలోచనలకు ప్రజలను ఆకర్షించడంతో ఆయనను ఒక ప్రమాదంగా భావించారు. గద్దర్పై పలుమార్లు కాల్పులు జరగగా, వైద్యులు కొన్ని బుల్లెట్లను తొలగించగలిగినా ఒకటి ప్రమాదకర పరిస్థితుల వల్ల అలాగే మిగిలిపోయింది. తీవ్ర గాయాలున్నప్పటికీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ కేసును “అన్డిటెక్టెడ్”గా నమోదు చేయడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈ హత్యాయత్నం మేధావులు, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. వందలాది కవులు, రచయితలు, కళాకారులు ఈ ఘటనను ఖండిస్తూ పాటలు, కవితలు, వ్యాసాలు రాశారు.
“జమెదారి కోయిలో” అనే ప్రజాగీతం గద్దర్ కోలుకునే సమయంలో ప్రజల బాధ, ఆశలను ప్రతిబింబించింది. మౌనమవ్వని స్వరంఈ దాడి గద్దర్ను మౌనంగా చేయలేకపోయింది. దీనివల్ల ఆయన ప్రభావం మరింత పెరిగింది. ఆయన అణగారిన వర్గాల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తూ, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ స్వరంగా నిలిచారు. ఆయన ప్రదర్శనలు శారీరక అభివ్యక్తి, లయబద్ధ కదలికలు, భావోద్వేగ గాఢతతో కళారూపాల సరిహద్దులను దాటి ప్రత్యేక సాంస్కృతిక శక్తిగా నిలిచాయి.
మేధావులు, సమకాలీనులు గద్దర్ను కేవలం గాయకుడిగా కాకుండా కవి, స్వరకర్త, నర్తకుడు, రాజకీయ ఆలోచనాపరుడు, ప్రజలతో గాఢంగా అనుసంధానమైన కమ్యూనికేటర్గా వర్ణించారు. ఆయన ఆలోచనలకు బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, కబీర్ వంటి భారతీయ సామాజిక సంస్కర్త ల ప్రభావం ఉంది. చిరస్థాయి వారసత్వంవిప్లవ వర్గాల్లో వివాదాలు, అంతర్గత చర్చలు ఉన్నప్పటికీ గద్దర్ సామాజిక న్యాయం, కుల సమస్యలపై తన చొరవను కొనసాగించారు. మారుతున్న సామాజిక-రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన తన ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం వల్ల ప్రజలతో ఆయన బంధం మరింత బలపడింది. 1997 హత్యాయత్నం ఆయన ఆత్మస్థైర్యాన్ని తగ్గించకపోగా, భారతదేశంలో ప్రతిఘటనకు ప్రతీకగా ఆయన స్థానాన్ని స్థిరపరిచింది.
సాంస్కృతిక ప్రేరక శక్తి
తెలంగాణ ఉద్యమం రెండో దశ రాజకీయాలతో మాత్రమే నడవలేదు; అది సాంస్కృతిక శక్తితో ముందుకు సాగింది. ఆ సాంస్కృతిక శక్తి మధ్యలో గద్దర్ నిలిచారు. 1990ల నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో భారీ సాంస్కృతిక పునరుజ్జీవనం కనిపించింది. గద్దర్ పాటలు తెలంగాణ కోసం ఉన్న డిమాండ్ను భావోద్వేగపూరిత, సమూహ ఆశయంగా మార్చాయి. ఆయన శబ్దం పేరుతో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొన్ని కమిటీలను వేసి కార్యక్రమాలను నిర్వహించారు. శబ్దం పేరుతో తెలంగాణ రాష్ట్రం కావాలనేదే విస్తృత కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. అనేక సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామాలు, పట్టణాలు చుట్టూ విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాటలు, నాటికలు, ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచాయి. ఈ కార్యక్రమాల్లో గద్దర్ ఉత్సాహభరిత హాజరు ఉద్యమానికి ప్రధాన చోదకశక్తి గా మారింది.ఆయన పాటలు నీటి వనరులు, ప్రాంతీయ అసమానతలు అన్యాయం, వనరుల దోపిడీ, నిరుద్యోగం, సాంస్కృతిక అణచివేత వంటి సమస్యలను ప్రతిబింబించాయి. ముఖ్యంగా కుల, వర్గ, ప్రాంత భేదాలను అధిగమించి తెలంగాణ గుర్తింపును బలపరిచాయి. అమరవీరుల స్మారక స్థూపాలు వంటి ప్రతీకలు ఉద్యమానికి బలం చేకూర్చగా, గద్దర్ పాటలు ఆ త్యాగాలను శాశ్వతం చేశాయి.పోరాటమే జీవితం
గద్దర్ జీవితం ఆయన కళలా పోరాటం, ధైర్యంతో నిండి ఉంది. 1997లో హత్యాయత్నం నుంచి బయటపడి, తన శరీరంలో బుల్లెట్తో జీవించారు. 2004లో ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించారు. వివిధ సిద్ధాంతాల మధ్య ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం గ్రామీణ ప్రజల నుంచి పట్టణ పేదల వరకు విస్తరించింది.
తెలంగాణ ఉద్యమం రెండో దశ రాజకీయాలతో మాత్రమే నడవలేదు; అది సాంస్కృతిక శక్తితో ముందుకు సాగింది. ఆ సాంస్కృతిక శక్తి మధ్యలో గద్దర్ నిలిచారు. 1990ల నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో భారీ సాంస్కృతిక పునరుజ్జీవనం కనిపించింది. గద్దర్ పాటలు తెలంగాణ కోసం ఉన్న డిమాండ్ను భావోద్వేగపూరిత, సమూహ ఆశయంగా మార్చాయి. ఆయన శబ్దం పేరుతో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కొన్ని కమిటీలను వేసి కార్యక్రమాలను నిర్వహించారు. శబ్దం పేరుతో తెలంగాణ రాష్ట్రం కావాలనేదే విస్తృత కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. అనేక సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామాలు, పట్టణాలు చుట్టూ విస్తృతంగా నిర్వహించబడ్డాయి. పాటలు, నాటికలు, ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచాయి. ఈ కార్యక్రమాల్లో గద్దర్ ఉత్సాహభరిత హాజరు ఉద్యమానికి ప్రధాన చోదకశక్తి గా మారింది.ఆయన పాటలు నీటి వనరులు, ప్రాంతీయ అసమానతలు అన్యాయం, వనరుల దోపిడీ, నిరుద్యోగం, సాంస్కృతిక అణచివేత వంటి సమస్యలను ప్రతిబింబించాయి. ముఖ్యంగా కుల, వర్గ, ప్రాంత భేదాలను అధిగమించి తెలంగాణ గుర్తింపును బలపరిచాయి. అమరవీరుల స్మారక స్థూపాలు వంటి ప్రతీకలు ఉద్యమానికి బలం చేకూర్చగా, గద్దర్ పాటలు ఆ త్యాగాలను శాశ్వతం చేశాయి.పోరాటమే జీవితం
గద్దర్ జీవితం ఆయన కళలా పోరాటం, ధైర్యంతో నిండి ఉంది. 1997లో హత్యాయత్నం నుంచి బయటపడి, తన శరీరంలో బుల్లెట్తో జీవించారు. 2004లో ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించారు. వివిధ సిద్ధాంతాల మధ్య ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం గ్రామీణ ప్రజల నుంచి పట్టణ పేదల వరకు విస్తరించింది.
తెలంగాణను పాడించిన స్వరం
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర అపారమైనది. ముఖ్యంగా రెండో దశలో ఆయన సంస్కృతిని రాజకీయ శక్తిగా మార్చారు. పాటలను ప్రజా ఉద్యమ సాధనాలుగా మలిచారు. భూస్వామ్య దోపిడీ, కుల వివక్ష, వలసలు, రైతుల ఆత్మహత్యలు, కరువు, సాంస్కృతిక వేరుపాటు వంటి సమస్యలను ఆయన పాటలు ప్రతిబింబించాయి. ఈ అంశాలు ప్రజల్లో లోతుగా ప్రతిధ్వనించి, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డాయి.గద్దర్ కేవలం గాయకుడు కాదు ఒక ఉద్యమం, ఒక సిద్ధాంతం, ఒక సాంస్కృతిక విప్లవం. తెలుగు సాహిత్యం, ఉద్యమ చరిత్రలో ఆయన కాలాన్ని “గద్దర్ యుగం”గా గుర్తిస్తారు. చరిత్ర చెబుతుంది, తెలంగాణను రాజకీయాలు కోరుకున్నా, ప్రజల హృదయాల్లో ఆ ఆకాంక్షను నింపి, దాని కోసం పోరాడేలా చేసింది గద్దర్ పాటే.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర అపారమైనది. ముఖ్యంగా రెండో దశలో ఆయన సంస్కృతిని రాజకీయ శక్తిగా మార్చారు. పాటలను ప్రజా ఉద్యమ సాధనాలుగా మలిచారు. భూస్వామ్య దోపిడీ, కుల వివక్ష, వలసలు, రైతుల ఆత్మహత్యలు, కరువు, సాంస్కృతిక వేరుపాటు వంటి సమస్యలను ఆయన పాటలు ప్రతిబింబించాయి. ఈ అంశాలు ప్రజల్లో లోతుగా ప్రతిధ్వనించి, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డాయి.గద్దర్ కేవలం గాయకుడు కాదు ఒక ఉద్యమం, ఒక సిద్ధాంతం, ఒక సాంస్కృతిక విప్లవం. తెలుగు సాహిత్యం, ఉద్యమ చరిత్రలో ఆయన కాలాన్ని “గద్దర్ యుగం”గా గుర్తిస్తారు. చరిత్ర చెబుతుంది, తెలంగాణను రాజకీయాలు కోరుకున్నా, ప్రజల హృదయాల్లో ఆ ఆకాంక్షను నింపి, దాని కోసం పోరాడేలా చేసింది గద్దర్ పాటే.





