- పార్టీ పట్ల విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం
- 27 మంది ఉపాధ్యక్షులు నియామకం
హైదరాబాద్, జూన్ 10 : రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది. పదవుల భర్తీలో పార్టీ పట్ల విధేయత, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్నవారికి, యువతకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో మాదిరిగానే పీసీసీలోనూ బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ చాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న సీనియర్లకే ఎక్కువ పదవులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ నేతలు రఘువీర్, బల్మూరి, బొంతు రామ్మోహన్ లకు కీలక పదవులు దక్కాయి. నల్గొండ ఎంపీగా ఉన్న రఘువీర్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొంతు రాంమోహన్ వంటి వారికి ఉపాధ్యక్ష పదవులు వరించాయి. ఇక ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్నికారెడ్డి, మట్టా రాగమయ సీనియర్ నేతలు షబ్బీర్అలీ, శశికళా యాదవరెడ్డిలకు పదవులు దక్కాయి. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలకు పార్టీ పదవులు కట్టబెట్టారు. సీనియర్లు, జూనియర్ల కలయికతో కొత్త తరానికి కూడా తగిన ప్రాధాన్యమిచ్చినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
పీసీసీ ఉపాధ్యక్షులు వీరే..
ఎంపీ రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజ్ సారయ్య, పార్టీ నేతలు కుమార్రావు, ఝాన్సీరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, ఆత్రం సుగుణ, గాలి అనిల్కుమార్, చిట్ల సత్యనారాయణ, బండి రమేశ్, కొండ్రు పుష్పలీల, కోట నీలిమ, కైలాశ్కుమార్, లకావత్ ధనవంతి, ఎం.వేణుగౌడ్, కొమిరెడ్డి వినయ్రెడ్డి, బొంతు రాంమోహన్, ఆఫ్సర్ యూసుఫ్జాహీ, కొండేటి మల్లయ్య, ఎం.ఎ.ఫహీం, సురేష్కుమార్, ఎస్.జగదీశ్వర్రావు, గుమ్ముల మోహన్రెడ్డి, చిన్నపటల సంగమేశ్వర్, ముజాహిద్ ఆలంఖాన్లు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.
పార్టీ ప్రధాన కార్యదర్శులు…
ఎమ్మెల్యేలు… మట్టా రాగమయి, సీహెచ్ పర్నికారెడ్డి, వెడ్మ బొజ్జు, నేతలు.. షబ్బీర్అలీ, సీహెచ్ రాంభూపాల్, ఎం.బేబీ స్వర్ణకుమారి, ధారాసింగ్ తాండూరు, జి.శశికళా యాదవరెడ్డి, కత్తి వెంకటస్వామి, ఎ.సంజీవ్ ముదిరాజ్, బొజ్జా సంధ్యారెడ్డి, మల్లాడి రామిరెడ్డి, అబ్డేషి సదాలక్ష్మి, మహమ్మద్ అబ్దుల్ ఫహీం, సంతోష్కుమార్ రుద్ర, దుర్గం భాస్కర్, మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, కొప్పుల ప్రవీణ్కుమార్, ఎ.జంగారెడ్డి, కస్బా శ్రీనివాస్రావు, దుద్దిళ్ల శ్రీనివాస్, బద్దం ఇంద్రకరణ్రెడ్డి, చరగని దయాకర్, పీసరి మహిపాల్రెడ్డి, వి.జగదీశ్వర్గౌడ్, నరేష్జాదవ్, అల్లంభాస్కర్, గిరిజా శెట్కార్, గజ్జెలకాంతం, ఈడ్పుగంటి సుబ్బారావు, పృథ్వీచౌదరి వేముల, అంబడి రాజేశ్వర్, డీడీ వెంకట్రాజ్, బోరెడ్డి ప్రభాకర్రెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్, కాట్ల రంగారావు, పి.శ్రీనివాస్రెడ్డి, మాడు సత్యనారాయణగౌడ్, తోపాజీ అనంతకిషన్, వి.రామారావుగౌడ్, అచ్యుత్ రమేష్బాబు, చకిలం రాజేశ్వరరావు, ఈర్ల కొమరయ్య, ఎ.రవిబాబు, నాగ సీతారాములు, శానెం శ్రీనివాస్గౌడ్, పెద్దనోళ్ల బాల మురళీకృష్ణ(చిన్న), రాయగిరి కల్పనాయాదవ్, రాజేష్ కషిపాక, రహమత్ హుస్సేన్, పి.ప్రసన్నకుమార్ శర్మ, మహమ్మద్ అసదుద్దీన్, నందిమళ్ల యాదయ్య ముదిరాజ్, ఎం.రాజీవ్రెడ్డి, షమీమ్ ఆఘా, ఈవీ శ్రీనివాస్రావు, మిథున్రెడ్డి, అమొగోత్ వెంకటేష్పవార్, దైదా రవీందర్, ఉప్పల శ్రీనివాస్గుప్త, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, జినూతి సత్యనారాయణగౌడ్, దుర్గాప్రసాద్, సి.వెంకట గోవింద్రావు, పెండ్లి శ్రీనివాసులురెడ్డి, .నాగభూషణం, ఉపేందర్రెడ్డి, ధర్మారావులు ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు.




