సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 7: సిద్దిపేట పట్టణం లోని 14,17 వార్డులో గ్రీన్ కాలనీ ముదిరాజ్ సంఘం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు ఆలకుంట మహేందర్ సిద్దిపేట 20 సంఘాల ముదిరాజ్ అధ్యక్షుడు మిద్దె రవి, సిద్దిపేట ముదిరాజ్ జేఏసీ టౌన్ అధ్యక్షుడు చెంది శ్రీనివాస్, జేఏసీ నాయకులు పడిగే ప్రశాంత్,. సుతరి రాజు. జిల్లెల్ల సుధాకర్,తోడెంగల నవీన్ పాల్గొని ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుకు మద్దతు ప్రకటిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంఘం మద్దతు పత్రాన్ని అందజేశారు.
మంత్రి హరీష్ రావుకే మా మద్దతు





