కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 7 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసింది ఎవరని ప్రశ్నించారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డే బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని అనలేదా అని నిలదీశారు. హోల్ సేల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా అని రేవంత్ను బండి సంజయ్ ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్సే కలిసి పోటీ చేయబోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్కు వోటేస్తే. బీఆర్ఎస్కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారన్నారు. దుబ్బాక, మునుగోడు, హుజురాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్ను దిల్లీలో, గల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీజేపీ బలంగా ఉందని..అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.




