వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
సూర్యాపేట, ప్రజాతంత్ర, : స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యమిస్తామని సూర్యాపేట (Suryapet) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి, కందుకూరి అంబేద్కర్, సోషల్ మీడియా ఇంచార్జ్ రామడుగు నవీన్ చారి, విజయ భాస్కర్, అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ అజీమ్, జవీద్, పట్టణ అధ్యక్షులు బొడ్డు సాయి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వినయ్, పవన్, సుదీర్, మండల అధ్యక్షులు వాలీ, అల్లేష్, శివ, సృజన్, సమీర్, గణేష్, మహేందర్, టీ సాయి, నాగరాజు, చెంచల నిఖిల్ నాయుడు, లక్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.





