రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొననున్న యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారిణులు..

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బుధవారం ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్ , సీనియర్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగం నుండి 14, సీనియర్ విభాగం నుండి మరో 14 మంది క్రీడాకారిణులు రాష్ట్రస్థాయికి సెలక్టు అయ్యారు. సెలెక్ట్ అయిన క్రీడాకారిణులు డిసెంబర్ లో జరిగే జూనియర్ , సీనియర్ బాలికల కబడ్డీ, రాష్ట్ర స్థాయి క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా తరుపున పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అతిధి Dyso ధనుంజయి ,జిల్లా కబడ్డీ అధ్యక్షులు గొంగిడి మహేంద్రరెడ్డి ,హై స్కూల్ HM మల్లికార్జున్ , జిల్లా కబడ్డీ అసోసియేషన్,అధ్యక్షులు పూల నాగయ్య,కోశాధికారి.గంధమల్ల.కుమార్,PET లు విజయ్,సురేందర్,చంద్రకుమార్,మనోహర్,రాము,శేఖర్,ఆదర్శ యువజన మండలి కార్యవర్గం, అధ్యక్షులు. కటకం.శ్రీనివాస్, కన్వీనర్ ఇరిటెపు.శ్రీనివాస్,పాండు,కుమార్,సురేష్,భాస్కర్,యాదగిరి,బాలసిద్ధులు,సైదులు,బోలు,మహేందర్,రాజు,ప్రవీణ్, మల్లేష్, అశోక్, బాబు,సభ్యులు, యువకులు, గ్రామప్రజలు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *