ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు
నెల రోజుల్లో టిమ్స్ సనత్ నగర్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తి. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేదా ఎప్పటిలాగే మరో తేదీ ప్రకటిస్తారా? అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదిక గా కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ దీనికి మీ సమాధానం ఏమిటి అని ప్రశ్నించారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో గప్పాలు కొట్టడం తప్ప, టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి శూన్యం., టిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభం పై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదు అని పేర్కొన్నారు . “కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే తనికెళ్ళ భరణి గారు చెప్పే కవిత్వం లాగా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఉంది! ప్రభుత్వ భూములను తెగనమ్మడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు వైద్య సేవలు అందించే హాస్పిటల్స్ మీద లేకపోవడం సిగ్గుచేటు అన్నారు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తే నత్త కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ హాస్పిటల్స్ నిదర్శనం అన్నారు. హాస్పిటల్స్ నిర్మాణాలు పూర్తి చేయకుండా, పేదలకు వైద్యం అందించకుండా క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతున్నది.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. కొరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు.. హైదరాబాద్ నలువైపులా టిమ్స్ హాస్పిటల్స్ కు రూపకల్పన చేసారు. ఏప్రిల్ 26, 2022 నాడు దేశ చరిత్రలోనే ఒకే రోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు శరవేగంగా జరిగిన హాస్పిటల్స్ నిర్మాణ పనులు కాంగ్రెస్ రాగానే నత్తనడకన సాగుతున్నాయి. హాస్పిటల్స్ పూర్తయితే కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్దితో రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే టిమ్స్ హాస్పిటల్స్ పూర్తి చేయడం లేదు. కమీషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తి చేయకుండా, వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నది రేవంతు ప్రభుత్వం అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొన్న అక్టోబర్ 3నాడు బిఆర్ఎస్ పార్టీ తరుపున మేము కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్ సందర్శించి, హాస్పిటల్స్ నిర్మాణాలు పూర్తి చేయడంతో ప్రభుత్వ పైఫల్యాన్ని నిలదీసినం. హడావుడిగా సమీక్షలు నిర్వహించి, హాస్పిటల్ ప్రారంభ తేదీలు ప్రకటించిన మంత్రులు ప్రజల తరుపున ప్రశ్నించినందుకు బిఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం టిమ్స్ హాస్పిటల్ సందర్శించి నెలన్నర రోజులు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పనులు త్వరితగతిన చేపడుతామని సాక్షాత్తూ మంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుండా పోయింది. ఇప్పటికైనా బిఆర్ఎస్ మీద నోరుపారేసుకోవడం మానేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కనపెట్టి టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయండి. పేదలకు సైతం అత్యున్నతమైన వైద్యం అందాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని హితవు పలికారు..





