
దశాబ్దం కిందటదేశంలోనే అగ్రగామిగా ఉన్
అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె
గత ఏడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద రాష్ట్రంలో ఉన్న ఉపకులపతులను పొమ్మనలేక పొగ పెట్టారు. గత రెండు సంవత్సరాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా విశ్వవిద్యాలయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారింది. ఏమి చేస్తున్నావ్ కోడలా అంటే ఉలగబోసి తీసుకుంటున్నాను అన్నట్లు ఉంది విశ్వవిద్యాలయాల పరిస్థితి. మూడు నెలలకోసారి జరగాల్సిన పాలకమండలి సమావేశం పది నెలలకోసారి జరుగుతోంది. ఉన్నత విద్య నిధులు నిలుపుదల చేస్తామని యూజీసీ కొన్ని విశ్వవిద్యాలయాలకు తాఖీదు ఇచ్చారు. ఇంచార్జి ఉపకులపతి నిర్లిప్త ధోరణి వలన సమస్యలు జఠిలమైపోయాయి. ప్రతి చిన్న విషయం వేచి చూసే ధోరణి. ఇక్కడ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు పెనం నుంచి పొయ్యిలోకి పడినట్లు భావిస్తున్నారు. దిన దిన గండం నూరేళ్ళాయ్యుష్షు అన్నట్లు విశ్వవిద్యాలయ అధికారుల తీరు విశ్వవిద్యాలయ పురోగతికి ప్రతిబంధకంగా మారింది. చిన్న విషయాల పట్ల నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ధోరణి, అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి.
విశ్వవిద్యాలయం
ప్రతి విషయానికి దాటవేసే ధోరణి కనిపిస్తుంది. అధికారుల మధ్య పాలకమండలి సభ్యుల మధ్య సమన్వయం లోపించి గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకుంటున్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పటిష్టపరచడం, ఉపకులపతి నియామకాన్ని మరచిపోయి విశ్వవిద్యాలయాన్ని శాశ్వితంగా మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. మారాల్సింది అధికారుల పనితీరు మనుషులు కాదు. 2017, 2018 లలో జరిగిన అడ్డగోలు నియామకాల్లో పోస్టులు పొందిన వారిని తొలగించండి అని 2022 లో హైకోర్టు తెలిపింది. ఈ నియామకాలు చేసిన ఉపకులపతులు రిజిస్ట్రార్ల పై చర్యలకు ఉపక్రమించాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నాయి.
ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం రీసెర్చ్ స్కాలర్లు సమర్పించిన థీసిస్ గ్రంథాలకు చెదలు పట్టింది కానీ వారి వైవా మోక్షంలేదు. రౌతు మెత్తగుంటే గుఱ్ఱం మూడు కాళ్లతో పరుగెత్తింది అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. కొత్త కోర్సులకు , కొత్త కళాశాలలకు అఫిలియేషన్ కు మోక్షం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. ఈ విద్యా సంవత్సరంలో చాలా విశ్వవిద్యాలయలలో కొన్ని విభాగాలు మూసి వేయక తప్పదు. ఉన్న సీనియర్ అధ్యాపకులు రిటైర్ కావడం, గత దశాబ్ద కాలం నుండి నియామకాలు లేకపోవడం, దశాబ్ద కాలం కిందట చేరిన వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం సమస్యగా మారింది.
కొత్త నియామకాలు చేపట్టక ,రీసెర్చ్ ఎం
రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవలప్మెంట్ కోర్సు అన్నీ అనీత విద్య లాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు. ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో శంకుస్థాపన చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు. పరీక్షలు సకాలంలో జరపరు, ఫలితాలు వెల్లడించరు, పిహెచ్డి వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను శాశ్వితంగా మూసివేయడం ఖాయమని పిస్తుంది. ఉర్దూ, కేంద్ర విశ్వవిద్యాలయాలు మొదలుపెట్టి ఏడు సంవత్సరాలైన నిధుల లేమితో ఎప్పుడూ స్మశాన ప్రశాంతత నెలకొంటున్నాయి.
విద్యలో నాణ్యత ఉండాలని క్వాలిటీని పెంచడానికి కొత్తగా కన్సల్టెన్సీలు ద్వారా కో ఆర్డినేటర్ల ను నియమించి ఉన్న కొద్ది మంది అధ్యాపకులతో కమ్యూనిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ ఏర్పాటు చేసి అర్థం పర్థం లేని పనులు చేయిస్తున్నారు. కొత్త కోర్సులు బోధించడానికి బోధకులు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధ్యాపకులకు ఓరియెంటేషన్, రిఫ్రెషర్ కోర్సులు లేవు, బోధనా నైపుణ్యాలు మెరుగుపడాలంటే బోధకులకు కొత్త అంశాల పట్ల శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి, మెటీరియల్ దొరకడం లేదు. అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు, ఓరియెంటేషన్ కోర్సులు లేక కళాశాలలో బోధన చప్పగా ఉంది. యుద్ధ ప్రాతిపదికన విశ్వవిద్యాలయాల ప్రక్షాళన చేయకపోతే రెండు మూడు సంవత్సరాలలో శాశ్వితంగా కనుమరుగవుతాయి





