కుల్కచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున 3 గం ల సమయంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కొడుకు, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుపైన దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నోట్: ఘటనా స్థలంలో దృశ్యాలు భయంకరంగా ఉన్న కారణంగా పబ్లిష్ చేయడం లేదు.





