
అంత పెద్ద సభ, కెసిఆర్ గంభీర ప్రసంగం తరువాత, భారత్ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉనికికి, భవిష్యత్తుకి తిరుగులేని భరోసా దొరికినట్టు సంబరపడుతున్నారు. శ్రేణుల నుంచి బలప్రదర్శన, నాయకుడి నుంచి దిశానిర్దేశం దొరికాక, ఇక విజయానికి పరుగులు తీయడమే మిగిలిందని పార్టీ అభిమానులు, అనుకూల పరిశీలకులు నమ్మకం ప్రకటిస్తున్నారు. తటస్థులు, వ్యతిరేకులు కూడా సభ సృష్టించిన సంరంభాన్ని ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తున్నారు. సహనానికి సమయం ముగిసిపోయిందని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారికంగా ప్రకటించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే తప్పుపట్టడం బాగుండదని అనుకున్నామని, కానీ, ఏడాదిన్నర కావస్తుంటే, ఇక ఉపేక్షించలేమని ఆయన అన్నారు. మిగిలిన మూడున్నరేండ్లలో రేవంత్ ప్రభుత్వం తప్పులు దిద్దుకునేది కానీ, ఒప్పులు చేసేది కానీ ఏమీ ఉండదని కూడా ఆయన నిర్ధారణకు వచ్చారు.
బిఆర్ఎస్ మునుపటి రూపం, ఒకనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి ఇరవై నాలుగేండ్లు పూర్తయి, రజతోత్సవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభలో, కెసిఆర్ తనను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఓటమి వల్ల తమ పార్టీ ఏమీ కుంగిపోలేదని,రానున్న రోజులలో రాష్ట్రప్రభుత్వాన్ని చెమటలు పట్టించగలమని బిఆర్ఎస్ బహిరంగ సభ బలమైన సంకేతం పంపింది. ప్రభుత్వాన్ని పడగొట్టబోమని, అదే పడిపోతుందని, వచ్చే సారి తమదే విజయమని కెసిఆర్ అన్న మాట, ఉన్నట్టుండి రాష్ట్రంలో మరుసటి ఎన్నికల చర్చను లేవదీసింది. కెసిఆర్ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తే, 2028లో తమదే విజయమని బిజెపి పోటీకి వచ్చింది.
2023 డిసెంబరులో తెలంగాణ ప్రజలు ఒకనిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి తొమ్మిదిన్నరేండ్లు పాలించిన ఉద్యమపార్టీని అధికారం నుంచి తొలగించారు. అది ప్రధానంగా వ్యతిరేక ఓటే తప్ప, కాంగ్రెస్ కు సానుకూల ఓటు కాదని అందరూ ఒప్పుకుంటారు. ప్రత్యామ్నాయంగా తమను తాము చెప్పుకుంటూ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు కొన్ని అరకొరమాత్రమే నెరవేరతాయని, కొన్ని అసలే నెరవేరవని తెలంగాణ సమాజం ఆరునెలల్లోనే అర్థం చేసుకున్నది. అయినంత మాత్రాన, పాత ప్రభుత్వాన్ని గద్దె దించడం పొరపాటని పశ్చాత్తాపమేమీ చెందడం లేదు. అట్లాగని, కొత్త ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకంజ కూడా వేయడం లేదు. ఓటర్లు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారో ఓడిన బిఆర్ఎస్ కానీ, గెలిచిన కాంగ్రెస్ కానీ గ్రహించనే లేదు, గ్రహించినా గ్రహించనట్టు నటిస్తున్నాయి.
ఎల్కతుర్తి సభలో కెసిఆర్ లో కనిపించిన కొత్తదనం ఏమిటంటే, ఆయన స్థిమితంగా మాట్లాడిన తీరు. చీల్చిచెండాడే శైలిని ఆయన ఆశ్రయించలేదు. అట్లాగని, ప్రత్యర్థిని ఆయన కనికరించలేదు. ఒక క్రమానుగత నిర్మాణం కలిగిన ప్రసంగాన్ని ఆయన ఒక కథలాగా ఆసక్తికరంగా చెప్పారు, కానీ, గంభీరంగా చెప్పారు. ప్రత్యక్షంగా సభాప్రాంగణంలో ఉండి విన్న లక్షలాది మంది, టీవీల ద్వారా, యూట్యూబుల ద్వారా వీక్షించిన అనేక లక్షలమంది ఆసక్తిని ఎక్కడా పోగొట్టుకోలేదు. ఇటువంటి సెలయేటి ప్రసంగాన్ని కూడా ఆగ్రహోదగ్ర వాగ్ధాటిగా భావించిన వీరాభిమానులున్నారు. మరోవైపు, ఉపన్యాసంలో వేడి తగ్గిపోయిందని, ఇది కెసిఆర్ బ్రాండ్ స్పీచ్ కాదని కొందరు వ్యాఖ్యానించారు. ప్రసంగంలో వినిపించిన నింపాదితనం వయసు వల్లో, అలసట వల్లో వచ్చిన మార్పు కాదని, సంకల్ప పూర్వకంగా ఎంచుకున్న శైలి అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడాన్ని కూడా కెసిఆర్ ఆభిజాత్యానికి గుర్తుగా చెప్పినవాళ్లు ఉన్నారు కానీ, అది తనను తాను రాజకీయ చర్చల్లో ఒక మెట్టు పైన ఉంచుకునే ప్రయత్నమే అనిపిస్తుంది. ఒకటి రెండు దూకుడు మాటలు, మొరటు మాటలు లేకపోలేదు కానీ, మొత్తం మీద ఇది మర్యాదైన ప్రసంగమే. గాంభీర్యం గౌరవాన్ని పెంచుతుంది. ఓపిక, అభిమానం ఉన్న ప్రేక్షకులు విషయ వివరణ కలిగిన ప్రసంగాన్ని కూడా శ్రద్ధగా ఆలకిస్తారని ఎల్కతుర్తి సభ నిరూపించింది.
చమత్కారాలు, తిరస్కారాలు, ఆగ్రహాలు పెద్దగా లేని ప్రసంగంలో, కెసిఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పారు. ఒక జాబితా చదివి, సభికులు తనతో గొంతు కలిపేట్టు చేశారు. తన హయాంలో ఉన్న పరిస్థితితో పోల్చారు. సభలు జరిగే మైదానాల్లో, అల్లరిగా వ్యవహరించేవారిని, నినాదాలు ఇచ్చేవారిని మందలిస్తూ లేదా దూషిస్తూ ప్రసంగం మధ్యలో ఒకటి రెండు వ్యాఖ్యలు చేయడం కెసిఆర్కు అలవాటే కానీ, సభలోని అత్యధికులను ఉద్దేశించి సానుకూలంగా సంభాషణ చేయడం అరుదు. మావోయిస్టుల మీద కేంద్రం చేస్తున్న ‘ఆపరేషన్ కగార్’ విరమించుకోవాలని పార్టీ తరఫున విజ్ఞప్తి చేద్దామా అని అడిగి, సభ నుంచి ఆమోదం తీసుకోవడం, ఆ అంశం రీత్యాను, ఆ పద్ధతి రీత్యాను విశేషమైనది. అన్ని విషయాల్లో, ఇటువంటి కలివిడి తనాన్ని, ఆలకింపునే కదా ఆయన నుంచి ఇంతకాలం కోరుకున్నది!
ప్రధాన ప్రతిపక్షం బలపడితే, గొంతు పెంచితే అది ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిది. ఆ లెక్కన బిఆర్ఎస్ కు దక్కిన కొత్త జవసత్వాలు తెలంగాణకు మేలుచేయగలిగేవే. నిజానికి, పదిహేనునెలలు వేచిచూశామని కెసిఆర్ అన్నారు కానీ, అది కేవలం ఆయన ఒక్కరి ప్రమేయానికి సంబంధించి మాత్రమే వర్తించే మాట. అధినేత మినహా తక్కిన నాయకగణం అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వస్తున్నది. రేవంత్ రెడ్డి భాషావైభవానికి దీటుగా తాను కూడా మాటలను పదునుపెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా, తన పరిమితులు, వైఫల్యాల సంగతి ముందే తెలుసును కాబట్టి, బిఆర్ఎస్ పాలన మీద విరుచుకుపడడం ద్వారా రాజకీయ సంవాదాన్ని ద్వైపాక్షికంగా తీర్చి దిద్దింది. తన వైఫల్యాలకు బిఆర్ఎస్ దుష్పరిపాలనే కారణమని వాదించసాగింది. బిఆర్ఎస్ హయాంలో జరిగాయని చెబుతున్న అక్రమాల మీద, అవినీతి మీద దర్యాప్తులు, కేసుల పేరుతో వాతావరణాన్ని వేడెక్కిస్తూ వచ్చింది. తాను సూచించినట్టు, రాజకీయ రంగస్థలంలో కెసిఆర్ గనుక పూర్తి సమయం వెచ్చించడం మొదలు పెట్టిన తరువాత కూడా, రాజకీయ కార్యాచరణలు, ఆరోపణ ప్రత్యారోపణలు ఇదే తీరుగా సాగితే గనుక, ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు.
రెండు పాలనలను ప్రజలు మున్ముందు ఎప్పుడో బేరీజు వేస్తారు, ఏది మంచి ఏది చెడు అని లెక్కలు తీస్తారు. కానీ, అది తమ అవగాహనను అనుభవాన్ని పోల్చుకోవడానికి, మున్ముందు విచక్షణను పెంచుకోవడానికి చేస్తారు కాని, తాము ఓడించిన పార్టీ ముందు, నాయకుడి ముందు గుంజీలు తీయరు. తప్పుచేసిన నాయకులు ఆ పనిచేయాలి. ‘మీకే అనుభవానికి వస్తుంది, మీరే అప్పుడు గతిలేక నా దగ్గరకు వస్తారు’- వంటి వ్యక్తీకరణలను ప్రజలు ఆనందించరు. నిజానికి, ప్రజల ముందు మనసు విప్పుకోవడానికి ఎల్కతుర్తి సభ ఒక మంచి అవకాశం. ప్రతికూలత రావడానికి కారణమైన పరిస్థితులను, విధానాలను గుర్తించామని, వాటిని సవరించుకుంటామని ఒక్క మాట అంతటి నాయకుడి నుంచి వస్తే, ప్రజలు నిన్నటి చేదు అనుభవాలను పక్కనబెడతారు. రేపు రేవంత్ రెడ్డి మీద మనసు విరిగి, తిరిగి కెసిఆర్ ను ఆశ్రయించవలసి వచ్చినా, అది ప్రతికూల ఓటుతో దక్కే విజయమే అవుతుంది తప్ప, 2014 లాగా సానుకూల ఎంపిక కాదు.
2023 డిసెంబరులో తెలంగాణ ప్రజలు ఒకనిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి తొమ్మిదిన్నరేండ్లు పాలించిన ఉద్యమపార్టీని అధికారం నుంచి తొలగించారు. అది ప్రధానంగా వ్యతిరేక ఓటే తప్ప, కాంగ్రెస్ కు సానుకూల ఓటు కాదని అందరూ ఒప్పుకుంటారు. ప్రత్యామ్నాయంగా తమను తాము చెప్పుకుంటూ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు కొన్ని అరకొరమాత్రమే నెరవేరతాయని, కొన్ని అసలే నెరవేరవని తెలంగాణ సమాజం ఆరునెలల్లోనే అర్థం చేసుకున్నది. అయినంత మాత్రాన, పాత ప్రభుత్వాన్ని గద్దె దించడం పొరపాటని పశ్చాత్తాపమేమీ చెందడం లేదు. అట్లాగని, కొత్త ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకంజ కూడా వేయడం లేదు. ఓటర్లు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారో ఓడిన బిఆర్ఎస్ కానీ, గెలిచిన కాంగ్రెస్ కానీ గ్రహించనే లేదు, గ్రహించినా గ్రహించనట్టు నటిస్తున్నాయి.
గ్రహించినట్టు కనిపిస్తే, దాన్ని అర్థం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ, కెసిఆర్, ఆయన పార్టీ ఇంతవరకు అటువంటి పని చేయలేదు. పైగా, తమను ఓడించడం తెలంగాణ ఓటర్ల తప్పు అని, దాన్ని వారు బాధాపూర్వకంగా గ్రహించి, తిరిగి తన దగ్గరకే రాకతప్పదని కెసిఆర్ బాహాటంగానే అంటున్నారు. ఎల్కతుర్తి సభలో కూడా ఆ ధోరణి ఏమీ మారలేదు. తన ఓటమికి దారి తీసిన కారణాల చర్చ కానీ, వివరణ కానీ ఆయన ప్రసంగంలో లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కెసిఆర్ హయాంలో జరిగాయని ఆరోపిస్తున్న అక్రమాల గురించి, అవినీతి గురించి ప్రస్తావన కూడా కెసిఆర్ చేయలేదు. కెసిఆర్ మీద విముఖత కలగడానికి కారణాలలో సకల స్థానాలలో కనిపించే ఆయన కుటుంబసభ్యులు. మాటవరసకైనా ఇద్దరు ముగ్గురు ఇతరులను నాయకులుగా వ్యవహరించడానికి అనుమతిస్తే, పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఈ సభలోనూ కుటుంబ ప్రాభవం బాగానే, ‘అప్రియమ’నిపించే స్థాయిలో కనిపించింది.
ప్రధాన ప్రతిపక్షం బలపడితే, గొంతు పెంచితే అది ప్రజాస్వామ్యానికి ఎంతో మంచిది. ఆ లెక్కన బిఆర్ఎస్ కు దక్కిన కొత్త జవసత్వాలు తెలంగాణకు మేలుచేయగలిగేవే. నిజానికి, పదిహేనునెలలు వేచిచూశామని కెసిఆర్ అన్నారు కానీ, అది కేవలం ఆయన ఒక్కరి ప్రమేయానికి సంబంధించి మాత్రమే వర్తించే మాట. అధినేత మినహా తక్కిన నాయకగణం అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వస్తున్నది. రేవంత్ రెడ్డి భాషావైభవానికి దీటుగా తాను కూడా మాటలను పదునుపెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా, తన పరిమితులు, వైఫల్యాల సంగతి ముందే తెలుసును కాబట్టి, బిఆర్ఎస్ పాలన మీద విరుచుకుపడడం ద్వారా రాజకీయ సంవాదాన్ని ద్వైపాక్షికంగా తీర్చి దిద్దింది. తన వైఫల్యాలకు బిఆర్ఎస్ దుష్పరిపాలనే కారణమని వాదించసాగింది.
రెండు పాలనలను ప్రజలు మున్ముందు ఎప్పుడో బేరీజు వేస్తారు, ఏది మంచి ఏది చెడు అని లెక్కలు తీస్తారు. కానీ, అది తమ అవగాహనను అనుభవాన్ని పోల్చుకోవడానికి, మున్ముందు విచక్షణను పెంచుకోవడానికి చేస్తారు కాని, తాము ఓడించిన పార్టీ ముందు, నాయకుడి ముందు గుంజీలు తీయరు. తప్పుచేసిన నాయకులు ఆ పనిచేయాలి. ‘మీకే అనుభవానికి వస్తుంది, మీరే అప్పుడు గతిలేక నా దగ్గరకు వస్తారు’- వంటి వ్యక్తీకరణలను ప్రజలు ఆనందించరు. నిజానికి, ప్రజల ముందు మనసు విప్పుకోవడానికి ఎల్కతుర్తి సభ ఒక మంచి అవకాశం. ప్రతికూలత రావడానికి కారణమైన పరిస్థితులను, విధానాలను గుర్తించామని, వాటిని సవరించుకుంటామని ఒక్క మాట అంతటి నాయకుడి నుంచి వస్తే, ప్రజలు నిన్నటి చేదు అనుభవాలను పక్కనబెడతారు. రేపు రేవంత్ రెడ్డి మీద మనసు విరిగి, తిరిగి కెసిఆర్ ను ఆశ్రయించవలసి వచ్చినా, అది ప్రతికూల ఓటుతో దక్కే విజయమే అవుతుంది తప్ప, 2014 లాగా సానుకూల ఎంపిక కాదు.
ప్రజలను అర్థం చేసుకుని, వారితో కనెక్ట్ కాగల సామర్థ్యం కెసిఆర్ కు ఉంది. తెలంగాణ సమాజం మౌలికతనే మార్చివేయగల పెద్ద సంక్షోభం బయటి నుంచి ముంచుకువస్తున్నది, లోలోపలి నుంచి పుట్టుకు వస్తున్నది. దాన్ని గుర్తించడంలోను, విరుగుడు రూపొందించడంలోను కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఘోరంగా విఫలమవుతున్నాయి. 2028 నాటికి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ ఓడిపోవచ్చును కానీ, దాని స్థానంలో బిఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకమేమీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ తన గమనాన్ని నిర్ణయించుకోవాలి. బస్తర్ అడవుల్లో మారణహోమం ఆగిపోవాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్షగా గ్రహించినట్టే, సాంస్కృతిక సామాజిక సామరస్యం, సహజీవనం తెలంగాణ సహజ విలువలని గుర్తించి, వాటిని కాపాడుకునే రీతిలో తన విధానాలను బిఆర్ఎస్ రూపొందించుకుంటే, అలనాటి ఉద్యమసంస్థగా తన బాధ్యతను నిర్వహించినట్టు అవుతుంది. జనసమ్మతిని కూడా అందుకుంటుంది.
ప్రజలు గతిలేక మళ్ళీ మాకే పట్టం కడుతరు అని ఇంకా బీఆర్ఎస్ అనుకుంటుంది అంటే నిజంగా అదే జరిగితే ఇక తెలంగాణను రక్షించే వారే ఉండరు.