వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

(నవంబర్ 20వ తేదీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా )

“పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.”
– ” డాక్టర్ “బి’ ఆర్’ అంబేడ్కర్”

పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది . పుస్తకం సామాన్యుని ఆయుధం. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో .“ అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆ మాటలు నేటికి పుస్తక ప్రియుల చేవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఒక మంచి పుస్తకం వేయి మంది మిత్రులతో సమానమని అన్నారు మరో మహానుభావుడు. ఎందరో మహాను భావులు పుస్తక పఠనం విశిష్టతను ప్రయోజనాలను తెలియచేశారు.

పుస్తకం ఓ మంచి నేస్తం.

ఒంటరి తనములో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు పుస్తకం. “పుస్తకం ఓ మంచి నేస్తం “.పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. బాధపడే వారిని ఓదార్చుతుంది.అలసిన మనసుల ను సేద తీరుస్తుంది.అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా నేస్తంగా అన్ని తరాలను అలరిస్తోంది. జీవితంలో విజ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడే సాధనంపుస్తకం.

పుస్తకం మనోవికాసానికి మార్గదర్శి .

మనోవికాసానికి మార్గనిర్దేశానికి “గురువుగా” ఉపయోగపడుతుంది. పుస్తక ప్రచురణ ప్రారంభమయిన తర్వాత మానవ జీవన గమనంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం టీ తాగితే వచ్చే హాయి పుస్తక పఠనం తో అంత హాయి వస్తుంది అంటారు. పుస్తక ప్రియులు . పుస్తక ప్రియులకు అన్నిటిని మరిపించే విజ్ఞాన, వినోద, వికాస భాండాగారం‌ పుస్తకం. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారి విజయ రహస్యం పుస్తకం. వారు ఎదిన క్రమంలో అనుభవాలు ఎదురుకొన్నకష్టాలను అక్షర రూపంలో అందించి దైర్ర్యాన్ని ఇస్తుంది పుస్తకం.

పుస్తక పఠనం _సామాజిక అవగాహన.
పుస్తక పఠనం వల్ల సామాజిక అవగాహన సమస్యల పరిష్కార శక్తి యుక్తి ఇనుమడిస్తుంది. సమయానుకూల స్పందనను మెరుగైన ప్రజా సంబంధాల దృఢత్వంతో. మానవీయ విలువలు రక్షించబడుతాయి .” నా బార్య బిడ్డల కన్న పుస్తకమే నాకు ఎక్కువ నా ప్రాణం పుస్తకం” అని *ఆంభేడ్కర్* అన్నారు. పుస్తకాలకు ఆయన అంత విలువ నిచ్చే వారు. ప్రస్తుతం అన్ని వయసుల వారు పుస్తకాలకు దూరమై టి‌ ‘వి చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ మానవ సంబంధాలు లేకుండా ఒంటరి జీవితానికి అలవాటు పడడం శోచనీయం.

సోషల్ మీడియా _ఒత్తిడి.
ఎప్పుడు సోషల్ మీడియాలో వుంటు కాలం గడిపే దుస్థితిలో కూరుకు పోవడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొనిచూడడం తప్ప చదవడానికి ఆసక్తి చూపడం లేదు.

పుస్తక పఠనంవిజ్ఞాన వికాసం.

ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవంతో తెలిసివస్తుంది. పుస్తకాన్ని చదవడంతో మనోవికాసం కలిగి నూతన ఆలోచనలు జనిస్థాయి . పుస్తకం అజ్ఞాన్ని తొలిగించి విజ్ఞాన్నిఅందిస్తుంది . గురువులా బోధిస్తుంది .ఒంటరితనంలో స్నేహితుడి లాగా అక్కున చేర్చుకుంటుంది. బాధపడేవారిని ఓదారుస్తుంది .అలసిన మనసుకు సేద తీరుస్తుంది .అందుకే పుస్తకం పఠనం తరాల తరాల సంస్కృతిని అందిస్తుంది. మానవ నాగరికత చరిత్ర వారసత్వం జాతి ఔన్నత్యం పట్ల అవగాహనకు పుస్తక పఠనం “వారధిగా” నిలవడం గమనార్హం. ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకొని పుస్తక పఠనం ఒక సామాజిక ఉద్యమంగా కొనసాగాల్సిన అవసరం ఉంది.

మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది ఉన్నాయి.సమకాలీన సమాజంలో సామాజిక’ సాంకేతిక మార్పులు ఎన్ని వచ్చిన పుస్తక ప్రియులు పుస్తకాన్ని వదలలేదు.సినిమాలు’ టివి లు ‘ఇంటర్నెట్ మొబైల్’ మాయలు దరి చేరిన పుస్తకం విలువ తగ్గలేదు. *రచయిత కాఫ్కా*
“మనల్ని గుచ్చి గాయపరిచి ఇబ్బంది పెట్టే రచనలు చదవాలి. మంచి పుస్తకం మనలో దాగి వున్న ప్రతిభను సృజనను తట్టి లేపాలి.పుస్తక పఠనం మనలో గడ్డ కట్టిన సముద్రాన్ని గొడ్డలి లాగా పగుల కొట్టాలి” అంటాడు ప్రముఖ “రచయిత కాఫ్కా.”

పుస్తక పఠనం ఆరోగ్యానికి మేలు.

పుస్తక పఠనం ఆరోగ్యానికి మేలు ‌చేస్తుంది. మేధస్సు సక్రమంగా పనిచేస్తుంది పాజిటివ్ ఆలోచనలు ప్రేరేపిస్తుంది .నెగెటివ్
దృక్పథాన్ని అరికడుతుంది.l
పుస్తక పఠనం బహుళ ప్రయోజనాలను నూతన ఆలోచనలు సృజన శక్తి తాత్వికత
శాస్త్రీయత విశ్లేషణ పరిశీలన పరిశోధన పరిష్కారం సామర్ధ్యం నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుంది.
విశ్లేషణా సామర్ధ్యాలను. పెంపొందిస్తుంది.

పుస్తకంపఠనం ఒత్తిడిని తగ్గిస్తుంది

అనవసర ఆలోచనలు నియంత్రిస్తుంది .శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది .ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే రాత్రి పడుకునే ముందు సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు చదవడం మంచిది.శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది .అలాగేఏకాగ్రత చేకూరి ఒంటరి తననాన్ని దూరం చేస్తుంది.ఎదిగే పిల్లలకు ఒక్కో వయసులో ఒక్కో తరహా‌ పుస్తకం అవసరం. ప్రారంభంలో బొమ్మలు కథలు పుస్తకాలు మొదలుపెట్టి నాగరికతలు ” పరికరాలు ‘సాహస గాధలు ‘ మహనీయుల జీవిత చరిత్రలు ‘ శాస్త్రవేత్తలు’ శాస్త్రవేత్తల ‘పరిశోధనలు ” మొదలగు అంశాల మీద అవగాహన చైతన్యం కలిగించడానికి అవసరమయ్యే పుస్తకాలు చదివే అలవాటు జీవన విధానములో బాగం కావాలి. మనదేశంలో “నవంబర్ 14 నుండి 20 వరకు 58 వ జాతీయ గ్రంథాలయం వారోత్సవాలు మహోత్సవాన్ని” నిర్వహిస్తున్నారు.

భారత్ లో చదువరుల సంఖ్య ఎక్కువ
ప్రపంచంలోపుస్తకాలు చదివే (పాఠకులు) చదువరుల సంఖ్యమీధ జరిపిన సర్వే లో భారతదేశంలో చదివే వారు ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువపుస్తకాలు చదివే వారు భారతీయులే . భారతీయులు వారానికి సగటున 10.2 గంటలపాటుపుస్తక పఠనం చేస్తారని దశాబ్ధం కింద చేసిన ఒక అధ్యయనము లో తేలింది. 2013 నాటి సర్వే ప్రకారం పుస్తక పఠనం సమయం 10.4 గంటలకు పెరిగింది.

టీ’వీలు సినిమాలు ఇంటర్నెట్ వినియోగం మారుతున్న జీవనశైలివల్ల పుస్తక పఠనము పై మోజు తగ్గలేదు.పుస్తక పఠనం లో భారత్ టాప్ లో వుండడం గర్వించదగిన అంశం( గమనార్హం) పుస్తక పఠనం చేసే వారి సంఖ్య మరింత పెరగాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో పుస్తకపఠనం తగ్గిపోయింది ఆన్లైన్లో చదువుతున్నారు .పుస్తకాలు పట్టుకుని పఠనం చేయడం మర్చిపోతున్నారు . అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగాపుస్తక పఠనం పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా పుస్తక ప్రదర్శన పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై‌ సెమినార్లు సదస్సులు వివిధ ప్రతిభ పాటవ పోటీలు నిర్వహించడం గమనార్హం.

ప్రభుత్వం పౌరసమాజం

పౌరసమాజం’ స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు ‘మహిళా సంఘాలు ‘యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు’ ఉద్యోగ సంఘాలు’ గ్రంధాలయాలస్థాపనకు నిర్వహణకు పూనుకోవాలి.పఠనంతో పరిజ్ఞాన పరివ్యాప్తిలో‌ క్రియాశీలక భాగస్వాములుకావాలి.పుస్తకాలు చదివే లక్షణం వాతావరణం ప్రజల్లో కలిగించాలి.పుస్తకాలు కొని చదివే సంస్కృతిని పెంపొందించడం . పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవలు గుర్తు చేసుకోవడం కొత్త తరాలను పుస్తక పఠనం వైపు ఆకర్షించడం ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం సందర్బంగా యునెస్కో ఆశయాలసాధన దిశగాకృషి జరగాలి.
కేంద్ర ‘రాష్ట్ర’ స్థానిక ప్రభుత్వాలు పౌర గ్రంధాలయాలు స్థాపనకు పూనుకోవాలి . పాటశాల కళాశాల స్థాయిలో లైబ్రరీ లలో డిజిటల్ టెక్నాలజీ ఆధునిక సమాచార సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పాఠకులకు మెరుగైన సేవలు అందించాలి .మానవ వనరుల సర్వతో ముఖాబివృద్ధికిదోహదపడే బహుముఖ చర్యలుచేపట్టి విజ్ఞాన భారత్ నిర్మాణానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక తో సగ్రమైన చర్యలకు.సంసిద్ధం కావాలని ఆశిద్దాం .

-నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page