Tag Telangana news updates

నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌28:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామం టూ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తు న్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 28 ‌సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు…

రాజ్‌ ‌పాకాలకు నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌జన్వాడ్‌ ‌ఫామ్‌ ‌కేసులో కీలక నిందితుడైన రాజ్‌ ‌పాకాల నివాసం ఓరియన్‌ ‌విల్లాలో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్‌ ‌పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్‌ ‌పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదిలావుంటే  జన్వాడ…

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌ కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు…

యాదవుల‌కు అన్నిరంగాల్లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం..

Revanth Reddy

నగరంలో సదర్ ఉత్సవాలు రాష్ట్రానికే గర్వకారణం.. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 27 : హైద‌రాబాద్‌ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను గ‌తంలోనే చెప్పానని సీఎం తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం…

Somasila to srisailam river trip: సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త అందించింది.. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ అక్టోబర్ 26 వ తేదీ నుండి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తెచ్చింది..…

గుస్సాడీ గురువు కనకరాజు మృతి

తెలంగాణ తొలి గిరిజన కళాకారుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్క•తి సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో  కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన…

‘‌నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు.. నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మరోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌…

స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌ ఇ‌న్ఫ్రాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ ‌ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్‌ ‌నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్‌ ‌సోషల్‌ ‌రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది.వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనుంది. ఇదే విషయమై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ ‌బాబు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఈ ‌సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ ‌యూనివర్సిటీ క్యాంపస్‌ ‌ను నిర్మిస్తామని మెఘా కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతమైన కందుకూరు మండలం మీర్‌ ‌ఖాన్‌ ‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్‌ ‌రెడ్డి భూమిపూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా క్యాంపస్‌ ‌నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపస్‌ ‌నిర్మాణానికి ముందుకు వొచ్చిన మెఘా కంపెనీకి సీఎం రేవంత్‌ ‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ ‌నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌సూచించారు. నవంబర్‌ 8‌వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 ‘మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు •రాష్ట్ర  ప్రభుత్వంతో ఎంవోయూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాంపస్‌.. •వొచ్చే నెలలోనే నిర్మాణ పనుల ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌…

ఇంటి వద్దకే టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌26:రాష్ట్ర ప్రజలకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్దకే నేరుగా టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలను అందించనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వెల్లడిరచారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్‌(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తున్నామని  మంత్రి పొన్నం తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో…