Tag Telangana news updates

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,జ‌న‌వ‌రి 29 :  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాల‌ని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు…

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్ట వేద్దాం..  

Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్య‌య‌నం న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియామ‌కం వారంలోపు నివేదిక స‌మ‌ర్పించండి.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్య‌య‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ…

న‌గ‌ర‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆస‌క్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ శివార్ల‌లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100…

అలెరియా ఏఐతో పన్నుల రాబడి పెరుగుదల

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఆయన తిలకించారు. ఆఫ్ లైన్ లో పనిచేసే…

హలో బీసీ- ఛలో వరంగల్‌

Hello BC- chalo Warangal

సిద్దమవుతున్న ఓరుగ‌ల్లు బహిరంగ సభకు భారీగా హాజ‌రుకానున్న బీసీలు హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): హలో బీసీ- ఛలో వరంగల్‌ ‌పేరుతో  వరంగల్ ఆర్ట్స్  అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న  నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా…

రైతు భరోసా చిల్లర పంచాయితీనా ?

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ? మాజీ మంత్రి హరీష్ రావు దావోస్ ప‌ర్య‌ట‌న గురించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా…

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి

ప్రపంచ స్థాయి న‌గ‌రంగా ఫ్యూచర్ సిటీ డావోస్ పర్యటనతో హైదరాబాద్ కు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రియల్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది మెట్రో విస్తరణకు రూట్ మ్యాప్ నీటిపారుద‌ల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ…

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్‌ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్‌ ‌స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…