Tag special lstories

కొలువుల తెలంగాణా’ కావాలి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే.తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా,ప్రాణాలని పణంగా పెడితే ఆ త్యాగల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది.తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి,అది వారి హక్కు కూడా.కానీ ఈ పదేండ్లలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశ,అసంతృప్తి,అందోనళ నను ప్రభుత్వం అర్ధం చేసుకొవాలి.ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీనీ అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మళ్ళీ చిగురించిన ఆశలు? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం,ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని, మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల భాధలు,సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకి కల్పించారు.కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2లక్షల ఉద్యోగాలు,జాబ్ క్యాలెండరు అనేది ఒక సంచలనం.పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బoదిగ జాబ్ క్యాలెండరు అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి.టీజీపిఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త ఛైర్మన్ ని నియమించడం మంచి పరిణామం.కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థలకీ విముక్తి కల్పించి, తల్లిదండ్రులకి లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది.ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లని ఏర్పాటు చేసి అనుభవజ్ఞ్యులైన అధ్యాపకుల చేత ఖరీదైనా కోచింగ్ ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకి ఇచ్చిన ప్రతి హామీని నిరవేర్చాలి? నిరుద్యోగుల బాధలను స్వయంగా చూడటానికి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధి అశోక్ నగర్ వొచ్చి, నిరుద్యోగుల బాధలను కళ్లారా చూసి చలించిపోయి మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఇది నా గ్యారెంటీ అని హామీ ఇవ్వడంతో, నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో మళ్ళీ పుస్తకాలని పట్టుకున్నారు.తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండరు,2లక్షల ఉద్యోగాల హామీ ఆనందాన్ని ఇచ్చింది.యేండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్ట్ మెట్లు ఎక్కకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, స్పష్టంగా జాబ్ క్యాలెండరులో పెట్టిన తేదీల ప్రకారం వేగంగా ఉద్యోగాలని భర్తీ చేయాలి.అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగభృతి 4000 రూపాయలని వెంటనే ప్రభుత్వం అందివ్వాలి. ప్రభుత్వం తండ్రిలా నిరుద్యోగబిడ్డలకి గౌరవప్రదమైన జీవితం దక్కేలా భరోసా కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడిబెట్టడం న్యాయమేనా? నిరుద్యోగులంటే అంత చిన్నచూపా, అవమానకారంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసిపడేయడం ఇది ఏ విధంగా ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది. మేం ఎన్నో కలలు కన్నాం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొస్తే 2లక్షల ఉద్యోగాలని,జాబ్ క్యాలెండరు ద్వారా భర్తీ చేస్తుందని అనుకున్నాం.ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10యేండ్లు అధికారంలో లేరు తప్పకుండ వారికి మా బాధలు తెలుసు కాబట్టి ఉద్యోగాల భర్తీనే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలనీ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్ధిస్తున్నారు.అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయడం నిజంగా బాధాకరం.ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే,అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా,కొట్లాడారు కదా?అప్పుడు మీరు అప్పులుతో ఉద్యోగాలని ఏందుకు ముదిపెట్టలేదు?మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి ఎప్పటికప్పుడు ఖాలీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి.ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రయివేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సహాకాలని అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి, ప్రయివేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకి దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమయినా సాంకేతిక నైపుణ్యలని ప్రభుత్వమే అందివ్వాలి.పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని మార్చాలి.అదేవిధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. -:శ్రవణ్ కుమార్ నల్ల నిరుద్యోగి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

విద్యార్థి యువతపై సామాజిక ప్రభావం..!!

Social impact on student youth..!!

మనిషి సంఘజీవి” అని అరిస్టాటిల్ అన్నాడు మనిషి సమిష్టిగా తప్ప మరోలా జీవించలేదు కనుక సమాజంలోని ప్రజలందరిపై సామాజిక ప్రభావం వుండటం సహజమూ తప్పనిసరి విద్యార్థి యువత పైన సమాజం తీవ్ర ప్రభావాన్ని ప్రసరిస్తుంది. విద్యార్థి యువతమీద వర్తమాన సమాజ ప్రభావాన్ని మనం అర్థం చేసుకునే ముందు విద్యార్థి యువత కుండే ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడం…

రైతు భరోసాపై విపక్షాల రభస

raitu bharosa

 15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్‌, ‌మోసమంటున్న బిజెపి ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం        ( మండువ రవీందర్‌రావు ) జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

అధ్యక్ష పదవిపై ఆశ‌ల ప‌ల్ల‌కీలో నేత‌లు

ఇప్పటికే స్క్రీనింగ్‌ అయిందంటున్న బిజెపి వర్గాలు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి) భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతలు పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తతంగం పూర్తయినప్పటి నుంచి ఈ పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సమర్ధుడైన నాయకుడికే ఈ పదవిని…

దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై నమ్మకం కలిగించాలి!

 స్వయం ప్రతిపత్తి మాత్రమే దీనికి పరిష్కారం… కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలను బలోపేతం చేయడంతో పాటు నిజాయితీగా పనిచేసే సంస్థలుగా తీర్చిదిద్దాల్సి ఉంది. మెరికల్కెన అధికారులను వీటికి కేటాయించాలి. ఎలాంటి కేసున్కెనా ఛేదించి ఫలితం చూపేలా తయారు చేయాలి. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చాల్సి అవసరం ఉంది.…

ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది..!

సమస్యల పట్టింపు లేని మోదీ  పాలన ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం… ధరలు ఎందుకు పెరుగుతున్నాయి… నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది… పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్‌ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే…

‘ఈనాడు’- ‘కాకతీయ పత్రిక’ల బంధం..

కాకతీయ కలగూర గంప-13 తెలంగాణ పాత ముచ్చట్లు ప్రారంభ రోజుల్లో ‘ఈనాడు’ దిన పత్రిక కు ఒక మేటి జర్నలిస్టు ను అందించిన అలనాటి ‘కాకతీయ పత్రిక’ 1974 ప్రాంతాల్లో రామోజీరావు గారు ఒక తెలుగు దిన పత్రికను ప్రారంభించి దానిని ఒక క్రొత్త పంథాలో నడపాలని అనుకున్నప్పుడు చలసాని ప్రసాదరావును సంప్రదించడం జరిగింది. ఆయనే…

You cannot copy content of this page