విధుశేఖర భారతీస్వామిని దర్శించుకున్న రామచందర్‌

– నల్లకుంట శంకరమఠంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: నల్లకుంటలో ఉన్న శృంగేరి శంకర మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శారదాంబ అమ్మవారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీ శ్రీ విధు శేఖర భారతీ సన్నిధానం వారిని దర్శింకున్నారు. వారి దివ్య ఆశీర్వాదాలు పొందారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం రాంచందర్‌ రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్‌ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *