– ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు
– కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరిక
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 19: పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని, అవసరం అయితే జైలుకు పంపిస్తాం అని కార్యకర్తలతో అన్నారు. కొందరు తాము బీజేపీ అంటూనే బీజేపీ నేతల మీదనే పోస్టింగ్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వంను అస్సలు చంపుకోవద్దని సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు. బీజేపీ సోషల్ మీడియా, లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ’పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం, టైమ్ కూడా ఇవ్వం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫేక్ అకౌంట్స్ ద్వారా బీజేపీపై పోస్టులు పెడుతున్నాయి. పార్టీ నేతలు ఒక మంత్రి దగ్గరకు వెళితే పిర్యాదు చేసేందుకు వెళ్లారని రాశారు. ఆ పేపర్ మీద రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాం. పోస్టింగ్లు పెడుతున్న వారిని కేసులు పెట్టీ జైలుకు పంపిస్తాం. ఇప్పటికే కేసులు పెట్టాం. పార్టీ మీద ఎవరు పోస్టులు చేసినా కౌంటర్ ఇవ్వండి. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదు. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడండి’ అని రామచందర్ రావు అన్నారు. ’డబ్బులిస్తే ఏది పడితే అది రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదు. యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. ఒకరు దుబాయ్, మరొకరు అమెరికాలో ఉండి తిడుతున్నారు. మీరు ఇండియాకు రండి.. సంగతి చెబుతాం. పార్టీ కార్యకర్తలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరిని ప్రోత్సహించినా, వాటిని ఫార్వర్డ్ చేసినా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నా మీద కూడా ఫేక్ వార్తలు వస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇస్తున్నా.. మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి అని అన్నారు,
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





