– ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– హాజరైన ప్రధాని మోదీ, జగదీప్ ధన్ఖడ్, వెంకయ్య, పలువురు ప్రముఖులు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 12: భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో శుక్రవారం ఉదయం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు జేపీ నడ్డా, పియూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రదాన్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉప రాష్ట్రపతులనూ ఆహ్వానించగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్యనాయుడు, హవిూద్ అన్సారీ తదితరులు కూడా హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఎన్డీయే కూటమికి చెందిన నేతలు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన సవిూప ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం విదితమే. ఆర్ఎస్ఎస్, జన్సంఫ్ు లాంటి సంస్థలతో 16 ఏండ్లకే రాధాకృష్ణన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, 2003 నుంచి 2006 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్రంలో 93 రోజులపాటు 19 వేల కి.విూ రథయాత్ర నిర్వహించారు. 2024 జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఏడాదిన్నరపాటు చేశారు. తెలంగాణ ఇన్చార్జి గవర్నర్గా, పుదుచ్చేరి లెప్ట్నెంట్ గవర్నర్గానూ పనిచేశారు. 1998, 1999లలో కోయంబత్తూర్ నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. అభిమానులు ఆయనను తమిళనాడు మోదీగా పిలుస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





