సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో కొర‌వ‌డుతున్న సంక్షేమం

  •  సంక్షేమ హాస్టళ్లలో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తారా?
  •  శానిటేషన్‌ ‌సిబ్బందిని ఎందుకు తొల‌గించారు?
  • మండిప‌డ్డ బీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో సంక్షేమం కొరవడిందనిపిల్లలే మ‌రుగుదొడ్లు ‌శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందనిబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. స్వీపింగ్‌‌శానిటేషన్‌ ‌కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారని కవిత గుర్తు చేశారు. వీరు టాయిలెట్లుతరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తొలగించినందున తాము టాయిలెట్లుగదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్‌ ఆవరణలోని బయటి పనులన్నీ రెగ్యులర్‌గా చేస్తున్న‌ట్టు పిల్ల‌లు చెప్పార‌ని కవిత వెల్ల‌డించారు.

 కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాలలోని వాచ్‌మెన్‌ ‌వాటర్‌ ‌ట్యాంక్‌ ‌క్లీన్‌ ‌చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యాసంస్థలలో అసిస్టెంట్‌ ‌కేర్‌ ‌టేకర్‌లను తొలగించి వారు చేసే వార్డెన్‌ ‌పనులను పిల్లలతో చేయించాలని చెబుతున్నారు.  ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్నా పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్‌ ‌చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్‌ ‌పనులు కూడా చేయవలసి వస్తున్న‌దన్నారు. శ్రమను గౌరవించడం నేర్పడం వేరువిద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్‌ ‌వర్కర్స్‌ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్‌గా చేయించడం నేరమని కవిత అన్నారు. 

ఇక్కడ ఆడియోలో వర్షిని  చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం టాయిలెట్‌ ‌కడగడం ఒకటి కాదు.  పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్‌ ‌చేయగలరా. అది కూడా రెగ్యులర్‌గా. సోషల్‌ ‌వెల్ఫేర్‌ ‌హాస్టల్స్‌లో చదివే పిల్లలు ఏమైనా పోష్‌ ‌బ్యాక్‌ ‌గ్రౌండ్‌ ‌నుండి వచ్చారావెళ్లి కూర్చోగానే టేబుల్‌ ‌పైకి ఫుడ్‌ ‌రాదు అనడం. ఎందుకు ఇలాంటి పనులు చేయరుచేయాల్సిందే అని ఒక ఐఏఎస్‌ అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్‌ ‌లేబర్‌ ‌నేర్పడం కాదు. కుల వివక్షశ్రమ దోపిడీ మాత్రమే అని కవిత అన్నారు. దీంతో పాటు 240 మంది అసిస్టెంట్‌ ‌కేర్‌ ‌టేకర్‌లను తొలగించడం కూడా. గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖీ చేసుకునే ఏర్పాటు ఉండాలి. అంతే కానీ పిల్లలతో పూర్తిస్థాయి వార్డెన్‌‌శానిటేషన్‌ ‌వర్కర్స్ ‌చేయించే పని చేయించడం కరెక్ట్ ‌కాదు. నలుగురు శానిటేషన్‌ ‌వర్కర్స్ ఒక వార్డెన్‌ ‌మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయమ‌న్నారు. పిల్లలు సమాజం దృష్టిలోప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానుతక్షణమే ఆ అధికారిని తప్పించాలినెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాలి. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *