అభ్యసన సామర్థ్యాల ఖిల్లా జనగామ జిల్లా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: విద్యార్థుల లభ్యస సామర్థ్యాలలో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం నుంచి జనగామ జిల్లాకు చోటు లభించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఒక్క జిల్లాకే ఈ అవకాశం దక్కింది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారం యంత్రాంగం పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక ఖాతా ‘ఎక్స్‌’ పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా కృషి ఆదర్శనీయమంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జనగామ సాధించిన విజయం మిగతా జిల్లాలకూ స్ఫూర్తిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *