ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి

– కలిపేంతవరకు పోరాటం ఆగదు
– ప్రజల సమస్యలు అర్ధం చేసుకోవడానికి ‘జనం ‌బాట’
– జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర విభజన తర్వాత ముంపునకు సంబంధం లేకపోయినా ప్రత్యేక ఆర్డినెన్స్ ‌తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదు పంచాయతీలు ఎట్టపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను ఆంధ్ర ప్రాంతంలోకి విలీనం చేసుకున్నారు. దీనివలన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తపట్నంలో ఉండటం వలన తీవ్ర ఇబ్బందులు క‌లుతున్నాయని, కాబట్టి వీటిని వెంటనే తెలంగాణలోకి విలీనం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ ‌చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని శుక్రవారం దర్శించుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేంతవరకు తాము ఉద్యమం చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపి ఐదు పంచాయతీలను తెలంగాణకి ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ ‌చేశారు. రామాలయం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రాముఖ్యత నలు దిశల వ్యాప్తిచెందేలా అభివృద్ధి పరచాలని కవిత డిమాండ్‌ ‌చేశారు.ముఖ్యమంత్రి ఆదివాసీ సంఘాల అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టామో తెలుపుతున్న విషయంలో వైట్‌ ‌పేపర్‌ ‌విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసారు.దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామివారి  దేవాలయానికి రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు పంచాయతీల ప్రజలతో ఆమె ముచ్చటించారు.జాగృతి సంస్థ 19 సంవత్సరాల పాటు ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపింది. ఖమ్మం జిల్లాలో, అక్కడ చాలా సంఖ్యలో ఆదివాసీలు నివశిస్తున్నారు, 30,000 నియామకాలు ఆదివాసీ కార్పొరేషన్‌లో చేయబడ్డాయో లేదో స్పష్టంగా చెప్పారు. ఆమె నిరాశ్రయులను చేసిన గొట్టికోయ ఆదివాసీ గ్రామాల కోసం న్యాయం కోరారు. జాగృతి సంస్థ తెలంగాణ ప్రజల సమస్యలు అర్ధం చేసుకోవడానికి ‘జనం ‌బాట’ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇప్పటివరకు 13 జిల్లాలు సందర్శించిన విషయాన్ని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14వ జిల్లా అని ఆమె పేర్కొంది. మంత్రి సీతక్క మరియు ముఖ్యమంత్రి రెవంత్‌ ‌రెడ్డిని ఆదివాసీ సంఘాల సమస్యలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *