హైద్రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: ఇండస్ట్రీస్ డిపార్టుమెంట్ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ నాయక్ ను టీజీవో నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి.కృష్ణ యాదవ్ తదితరులు బొకే అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల సహకారంతో ముందుకెళ్తానని తెలియజేశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





