మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: ములుగు జిల్లా గోవిందరావుపేట చేరుకోవడంతో ప్రజలు అధికంగా వచ్చి పూజలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకుని మేడారానికి తరలివస్తున్న పగిడిద్ద రాజుకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం సమీపంలోని గుండ్ల వాగు వద్ద మండల ప్రజలు స్వాగతం పలికి బస్సు ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటలకు లక్ష్మి పురం నుంచి తరలి వస్తుండగా మార్గమధ్యంలోని ముద్దుల గూడెం వస్త్ర గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికి మేడారానికి పంపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




