పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగం సీఈపై దర్యాప్తు జరపాలి

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పంచాయతీరాజ్‌ క్వాలిటీ విభాగంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న వై.రామకృష్ణపై వచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని ఆయనపై ప్రాథమిక దర్యాప్తు జరిపి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా సంబంధిత ఇంజనీర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణ స్థానంలో తాత్కాలికంగా మరొక ఇంజనీర్‌ను నియమించాల్సిందిగా ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *