రిజర్వేషన్ల అమలు సాధకబాధకాలపై చర్చ

మేధావులతో బీసీ కమిషన్‌ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఆర్డినెన్సును తీసుకురావాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్‌ బీసీ మేధావులతో శనివారం సమావేశమైంది. వారి అభిప్రాయాలను, సలహాలను స్వీకరించింది. ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురయ్యే సమస్యలు, అందుకనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు గురించి చర్చించారు. ఈ సమావేశంలో కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి రంగు, స్పెషల్‌ ఆఫీసర్‌ జి.సతీష్‌కుమార్‌, రీసెర్చ్‌ ఆఫీసర్‌ జి.లక్ష్మీనారాయణలతోపాటు మేధావులు శ్యాంమోహన్‌, సి.ఆర్‌.గౌరీశంకర్‌, రావమ్‌నందన్‌ స్వామి, లక్ష్మణ్‌యాదవ్‌, గంటి చంద్రుడు, కె.వి.గౌడ్‌, బైరి శేఖర్‌, పి.నరేంద్రబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *