ములుగు, ప్రజాతంత్ర, జులై 9: మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు మంత్రి సీతక్కకు ఫోన్ చేసి ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించేందుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం, స్పీకర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ములుగులోని మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు క్యాంప్ కార్యాలయానికి పోటెత్తగా సీతక్కతో కేక్ కట్ చేయించారు.
సీతక్కకు సీఎం, స్పీకర్ జన్మదిన శుభాకాంక్షలు



