సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా సమాచారం తో వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు దిల్లీ లో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. సచివాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
 సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్​, రియాద్​లోని డిప్యూటీ అంబాసిడర్​తో మాట్లాడారు. మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా.. ఉంటే ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని దిల్లీ లో ఉన్న రెసిడెంట్​ కమిషనర్​, కో ఆర్డినేషన్​ సెక్రెటరీని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page