చైనా–తైవాన్ వైరం

చైనా విధానంలో “వన్ చైనా పాలసీ” కీలకంగా నిలుస్తోంది. దాని ప్రకారం తైవాన్, చైనా అంతర్భాగం .ఇతర దేశాలు ఏవీ   తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు. ఈ విధానం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు పెట్టుకోలేవు. బీజింగ్ ప్రభుత్వం తైవాన్‌ను తిరిగి చైనా కంట్రోల్‌లోకి తెచ్చే లక్ష్యంతో రాజకీయ, ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అనేకసార్లు తైవాన్‌ను తిరిగి కలుపుకునే విషయంలో దృఢంగా ఉన్నట్టు ప్రకటించారు. అవసరమైతే శక్తి ప్రయోగాన్ని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తైవాన్ ప్రజలు చైనాకు లోబడి జీవించాలనే దృష్టికోణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వతంత్ర గుర్తింపు కోసం తైవాన్ నాయకత్వం మారుతున్న ప్రతిసారీ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను వదిలిపెట్టబోమని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుత అధ్యక్షురాలు లాయ్ చింగ్-తే చైనాకు వ్యతిరేకంగా స్వతంత్రతను రక్షించే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రపంచ రాజకీయ పటంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యలలో చైనా–తైవాన్ సంబంధాలు ఒకటి. ఇది కేవలం భౌగోళిక విభేదమే కాదు, ఇది చరిత్ర, రాజకీయ సిద్ధాంతాలు, జాతీయత, అంతర్జాతీయ సమీకరణలు అన్నీ కలగలిసిన సంక్లిష్ట అంశం. చైనా-తైవాన్ విభేదానికి మూలాలు 20వ శతాబ్దం ప్రారంభం నుంచే మొదలైనాయి . 1912లో చైనాలో రాజవంశ పాలన ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యానికి మారింది. అయితే 1949లో జరిగిన కమ్యూనిస్టు విప్లవంతో మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టులు “పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా”గా దేశాన్ని ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా నేషనలిస్టులు (కుమింటాంగ్ పార్టీ) తైవాన్ ద్వీపానికి పారిపోయి అక్కడ “రిపబ్లిక్ ఆఫ్ చైనా” ప్రభుత్వాన్ని కొనసాగించారు. అప్పటినుంచి తైవాన్, చైనా నుంచి వేరుపడింది. కానీ చైనా మాత్రం తైవాన్‌ను తమ దేశంలో అంతర్భాగంగా  ప్రకటిస్తూ ఉంది.

చైనా విధానంలో “వన్ చైనా పాలసీ” కీలకంగా నిలుస్తోంది. దాని ప్రకారం తైవాన్, చైనా అంతర్భాగం .ఇతర దేశాలు ఏవీ   తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు. ఈ విధానం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు పెట్టుకోలేవు. బీజింగ్ ప్రభుత్వం తైవాన్‌ను తిరిగి చైనా కంట్రోల్‌లోకి తెచ్చే లక్ష్యంతో రాజకీయ, ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతోంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అనేకసార్లు తైవాన్‌ను తిరిగి కలుపుకునే విషయంలో దృఢంగా ఉన్నట్టు ప్రకటించారు. అవసరమైతే శక్తి ప్రయోగాన్ని కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

తైవాన్ ప్రజలు చైనాకు లోబడి జీవించాలనే దృష్టికోణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వతంత్ర గుర్తింపు కోసం తైవాన్ నాయకత్వం మారుతున్న ప్రతిసారీ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను వదిలిపెట్టబోమని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుత అధ్యక్షురాలు లాయ్ చింగ్-తే   చైనాకు వ్యతిరేకంగా స్వతంత్రతను రక్షించే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికా తైవాన్‌కు అండగా ఉండడమే చైనా కోపానికి ప్రధాన కారణం. అమెరికా అధికారికంగా తైవాన్‌ను దేశంగా గుర్తించకపోయినా, భద్రతా సహకారం, ఆయుధాల సరఫరా, వాణిజ్య సంబంధాల రూపంలో సహకరిస్తోంది. ఇటీవల అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసి తైవాన్‌కు వొచ్చినప్పుడు చైనా తీవ్రంగా స్పందించింది. భారీ సైనిక విన్యాసాలను  ప్రారంభించింది.  భారతదేశం “వన్ చైనా పాలసీ”ని పాటిస్తూ వచ్చినా, ఇటీవల తైవాన్‌తో అనౌపచారిక సంబంధాలు పెంచుతోంది. భారత పార్లమెంట్ సభ్యులు తైవాన్‌ను సందర్శించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది.  యూరప్ దేశాలు తైవాన్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతు ఉన్నప్పటికీ, చైనాను వ్యతిరేకించడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రికతలను గమనిస్తే 2025 జూలై నాటికి చైనా తైవాన్ మీద ఒత్తిడి కొనసాగిస్తోంది. తైవాన్ ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అయితే, తైవాన్ ప్రజలు స్వేచ్ఛా భావంతో ముందుకు సాగుతున్నారు. తైవాన్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యవాద పార్టీలే విజయం సాధించాయి. ఇది చైనా విధానానికి గట్టి ఎదురుదెబ్బ. ఇటీవలి సంవత్సరాల్లో తైవాన్ చుట్టూ చైనా వైమానిక దళాలు, నౌకాదళాల కదలికలు పెరిగాయి. తైవాన్ శక్తిని పరీక్షించేందుకు చైనా తరచూ వైమానిక సరిహద్దులను దాటి వస్తోంది. తైవాన్ కూడా తన వైమానిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. తైవాన్ ప్రపంచంలో అతిపెద్ద సెమికండక్టర్ తయారీదారిగా నిలుస్తోంది. ప్రత్యేకించి TSMC సంస్థ గ్లోబల్ టెక్నాలజీ పారిశ్రామికరంగానికి కీలకం. తైవాన్ మీద యుద్ధ ముప్పు పెరిగితే, ప్రపంచ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

చైనా-తైవాన్ వివాదం కేవలం ఒక భౌగోళిక యుద్ధమే కాదు. ఇది స్వేచ్ఛ మరియు నియంత్రణ మధ్య యుద్ధం. ప్రజల జీవన విధానం, అభిప్రాయ స్వేచ్ఛ, రాజకీయ స్వతంత్రత లాంటి అంశాల మీద ఇది ప్రభావం చూపుతోంది. చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా తైవాన్ ప్రజలు ఉక్కు సంకల్పంతో నిలిచారు. ప్రపంచం ఈ వివాదాన్ని మానవతా కోణంలో, శాంతియుత పరిష్కార మార్గాల్లో పరిశీలించి, ప్రజల ప్రయోజనాలను కాపాడే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.  .
ఇరు దేశాల ప్రజల జీవన విధానాలు 
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా లో ప్రజాస్వామ్యం లేదు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ పాలన అధికంగా కేంద్రీకృతమై ఉంటుంది. తైవాన్ ప్రజాస్వామ్య దేశం. స్వతంత్ర ఎన్నికలు జరుగుతాయి. అధికార మార్పులు ప్రజల వోట్ల ద్వారా జరుగుతాయి. చైనా లో మీడియా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ కమ్యూనిస్టు పార్టీ  నిబంధనలకు లోబడి ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ నిషేధం ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు  నిషేధం..! తైవాన్ అందుకు భిన్నంగా ప్రజాస్వామ్య ప్రకారంగా మీడియా స్వేచ్ఛ ..భావవ్యక్తీకరణ,   చట్టబద్ధమైన నిరసనల హక్కు పూర్తి స్వేచ్ఛ ఉంది.    చైనాలో  పెద్ద పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఉద్యోగ భద్రత తక్కువ. కఠిన పని నియమాలు ఎక్కువ ..తైవాన్ లో   ప్రైవేటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. కార్మిక హక్కులు బలంగా ఉన్నాయి.
చైనా లో పరీక్షల ఆధారిత, కఠిన విద్యా వ్యవస్థ. విద్యా స్వేచ్ఛ పరిమితంగా ఉంటుంది. తైవాన్ విద్యా విధానం అనువుగా, నూతనతకు ప్రాధాన్యం ఉంది. అంతర్జాతీయ విద్యాసంస్థలతో సహకారం ఎక్కువ. చైనాలో పౌరులు  పాలనా పద్ధతులపై ప్రజలు విమర్శించలేరు. సోషల్ క్రెడిట్ సిస్టమ్ వంటివి వ్యక్తిగత స్వేచ్ఛను తగ్గిస్తాయి. తైవాన్ లో  మహిళల హక్కులు, లెజ్బియన్-గే హక్కులు, పౌర హక్కులు బలంగా ఉన్నాయి. ఆసియా ఖండంలో మొదటి స్వలింగ  వివాహాలను చట్టబద్ధం చేసిన దేశం.  చైనాలో ప్రజలకు  దేశభక్తి ఎక్కువ.. ప్రభుత్వం చెప్పిందే న్యాయం అనే దృక్పథం తో నిబంధనలకు లోబడి జీవనం సాగించాల్సిన పరిస్థితి. తైవాన్ ప్రజలు స్వేచ్ఛను అధికంగా విలువ ఇస్తారు. స్వతంత్ర దేశంగా గుర్తింపు కోరుతూ ఉంటారు.  ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, అంతర్జాతీయ సమానత కోరుతూ ఉన్నారు.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *