Category Uncategorized

కేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించుకోవాలి

– ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి…

భారత్ ఫ్యూచర్ సిటీలో ‘హెల్త్ సిటీ’

– అంతర్జాతీయ ప్రమాణాలతో రోల్ మోడల్‌గా అభివృద్ధి – కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో మారుమూల ప్రాంతాలకు వైద్యం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తామని ఐటీ,…

పదవుల్లోనూ తోడూనీడగా

– చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లుగా భార్యాభర్తలు అశ్వారావుపేట/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : అవును వారిద్దరూ జీవితంలో భార్యాభర్తలుగా ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. కానీ రాజకీయ పదవుల్లో కూడా ఒకరికొకరు తీడునీడగా ఉండడం యాదృచ్ఛికమే. ఈ సంఘటన అశ్వారావుపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గం సోమవారం ఉదయం కొలువుదీరింది.…

ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న కేన్సర్‌లు, గుండె జబ్బులు, నాన్-కమ్యూనికెబుల్ వ్యాధులు (ఎన్‌సిడిలు) వంటి దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు ధూమపానం వలనే సంభవిస్తాయి. పొగాకు తాగేవారు శ్వాస సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు ఎందుకంటే, పొగాకు ఊపిరి తిత్తులను పూర్తిగా ప్రమాదానికి గురి చేస్తుంది. అంతేకాకుండా, వీరిలో అధిక శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా…

పుల్వామా అమరులకు నివాళి

– కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డాక్ట‌ర్‌ కావ్య వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 14) ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ ఎంపీ డాక్టర్…

ముఖ్యమంత్రిని కలిసిన వడ్డేపల్లి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు

– వారితో పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి జూపల్లి తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్‌లో గెలిచిన ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్…

మహా శివరాత్రి వేడుకలకు ఆల‌యాలు ముస్తాబు

– వేములవాడలో నేటి నుంచే రాజన్న జాతర – భీమేశ్వరాలయంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలను ముస్తాబు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, వరంగల్ వేయి స్తంభాల గుడి తదితర క్షేత్రాల్లో…

రైతులకు త్వరలో శుభవార్త

– రైతు భరోసా విడుదలకు రంగం సిద్దం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. మున్సిపల్ ఎన్నికల పక్రియ ముగిసిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం…

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– సీఎం, డిప్యూటీ సీఎంల‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ మహా దేవుడిని ప్రార్థించారు. మహా శివరాత్రి ఉపవాసాలు, పూజలను భక్తిప్రవత్తులతో నిర్వహిస్తున్న…