Category ప్రత్యేక వ్యాసాలు

ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు విడుదలెప్పటికో!!!

విద్య అనేది మన దేశం లో  పురాతన కాలం నుంచి సైతం అతి ప్రాముఖ్యమైనదిగా భావించేవారు. విద్య కు కు విజ్ఞానాన్ని బోధించే వారికి సైతం అధిక ప్రాముఖ్యతని ఇచ్చేందుకు అవకాశం ఉండేది. అందుకే అప్పట్లోనే మనదేశంలో నలంద మరియు తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం,  అంతేకాకుండా మన దేశం లో మొదట నుండి…

విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్‌

 ( మండువ రవీందర్‌రావు ) తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం!

ఒక జిల్లాలో 6వ ర్యాంక్‌ వచ్చిన బీసీ డీ అబ్బాయికి స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ  ర్యాంకు వచ్చిన ఓసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్‌ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన  ఓసి అమ్మాయికి జాబ్‌ వచ్చింది. మరొక జిల్లాలో…

తెలంగాణ బిడ్డ సాయిబాబాకు కన్నీటి నివాళి

 జాతుల సమస్య మీద, అణగారిన ప్రజా సమూహాల సమస్యల మీద ఆ అంతర్జాతీయ, జాతీయ అవగాహనకు కొనసాగింపుగానే ఎ ఐ పి ఆర్ ఎఫ్ 1997 డిసెంబర్ 28-29ల్లో వరంగల్ లో ప్రజాస్వామ్య తెలంగాణ సదస్సు నిర్వహించింది. అంతకు ముందే అదే సంవత్సరం భోనగిరిలో మార్చ్ 8-9ల్లో, సూర్యాపేటలో ఆగస్ట్ 11న తెలంగాణ ఆకాంక్షలపై సభలు…

అందరికీ ఆహార భద్రత అవసరం!

16 అక్టోబర్‌ నాడు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1981 నుండి ప్రతీయేడు ఈ రోజున ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతారు. గాలి, నీరు తర్వాత మానవునికి అవసరమైన మూడవ అతి ముఖ్యమైనది ఆహారం. ప్రతీ ఒక్కరికీ వైవిధ్యమైన పోషకార లభ్యత, సరైన పోషణ, ఆర్థిక స్థోమత, ఆహార భద్రత…

భద్రతా వ్యవస్థపై నిందలెందుకు…

security system

ప్రతి రాజకీయ నాయకుడికి తన పరిధిలో తన వర్గానికి చెందిన ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియచేసే హక్కు ఉంటుంది. లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జ్యుడీషియరీ మధ్య బయటకు కనపడని సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఎవరి పరిధిలోవారు తమ విధులను నిర్వహించాలి. విధి నిర్వహణలో ఘర్షణ తలెత్తినా, వైఫల్యాలను ఎండగట్టాలన్నా, సంబంధిత…

అడ్డూ అదుపులేని ధరలపై ఏదీ నియంత్రణ!

గత దశాబ్ద కాలంగా  కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తం చేసామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు.  దేశం ఆర్థిక అభివృద్దిలో దూసుకుని  పోతోందని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు అంత్యోదయ అన్నయోజన కింద సరఫరా చేసే ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే డిసెంబర్‌ వరకు పొడిగించారు.…

ఈ మౌనం ఎందాకా?

Concerns about KCR's silence.. Criticism

కెసిఆర్‌ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్‌ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య  నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ  వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…

చేతులు కడుగు రోగాలను తరుము!

ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో  150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో  వస్తాయి. తలుపుల హండిల్స్‌, కీబోర్డులు, సెల్‌ ఫోన్‌లు, లిఫ్ట్‌ బటన్‌లు, షాపింగ్‌ కార్ట్‌లు,…