Category సన్నివేశం

అమృతకాలంలో మర్యాదలన్నీ బలాదూర్‌!

“భారత రాజ్యాంగానికి 130 వ సవరణగా ప్రవేశపెట్టిన బిల్లు, మొరటు బేఖాతరు తనం నుంచి మాత్రమే రూపుదిద్దుకుంది. జైల్లో నెల రోజులు ఉండి కూడా పదవిలో ఉంటే, నైతికత ఏమి కావాలి, రాజ్యాంగ నైతికత ఏమి కావాలి? అని ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఆవేదన చెందుతున్నారు. వాళ్లు అట్లా క్షోభ పడడం విడ్డూరంగా అనిపిస్తే అది…

కాళ్ల కింద నేల కదులుతోంది, గమనించారా?

Legitimacy Crisis Looms Over PM Narendra Modi’s Leadership

“అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం…

నేతిబీర రాజకీయాలు, నైతిక హక్కులు

రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది.  జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్‌ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్‌ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది.  ఆ నాటి నుంచి దాన్ని…

‘తెలంగాణ నమూనా’ దేశమంతా వెలుగుతుందా?

“కాంగ్రెస్‌ మీద మొదట తిరుగుబాటు చేసినవి శూద్ర కులాలే. 1960లలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, వాటి వెనుక, ముందు శూద్రకులాల ఓటర్లు, పార్టీలు ఉన్నాయి. ఈ బిసికులాల పునాదిగా వివిధ జనతాపార్టీలు ఏర్పడి, ఉత్తరాది రాష్ట్రాలలో 70లలో, 80లలో  అవి అధికారానికి వచ్చాయి. అనంతర సమీకరణల్లో ఆ మధ్యేవాదపార్టీలు అధికంగా కాంగ్రెస్‌తోను, కొన్ని బిజెపితోను కలసి ప్రయాణించాయి. రాహుల్‌ గాంధీ హయాంలో మాత్రమే కాంగ్రెస్‌ స్పష్టమైన సామాజిక న్యాయ విధానాన్ని చేపట్టి, బిసి సాధికారత…

ప్రజలకు మేలుచేస్తే, పదేళ్లయినా ఉంటారు!

“ఏడాదిన్నర గడచిపోయింది. పరిపాలన మీద ప్రజలలో ఒక ఉజ్జాయింపు అంచనా ఏర్పడింది. అనుకూలత తగ్గడం, ప్రతికూలత పెరగడం వంటి నిర్ణయాత్మక సూచనలు కనిపించకపోవచ్చును కానీ, పెదవి విరుపులు కనిపిస్తున్నాయి, నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. జరగవలసినంత జరగకపోవడానికి, జరుగుతూ వస్తున్నవి కూడా కుంటుపడడానికి కారణాలు అన్నీరేవంత్‌రెడ్డి సమర్థతకు సంబంధించినవి కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు అనుకూలించడం లేదు.…

ప్రపంచ వేదిక మీద మన ప్రతాపం ఎంత?

శుక్రవారం నాడు భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఒక విద్యాసంస్థ కార్యక్రమంలో మాట్లాడుతూ,  న్యూయార్క్‌ టైమ్స్‌ తో సహా పశ్చిమదేశాల మీడియా ఎట్లా పక్షపాతంతో ఉందో చెప్పారు. పాకిస్థాన్ కు భారత్‌ కలిగించిన నష్టాల ఫోటోలు ఎన్నో మీడియాలో వచ్చాయని, భారత్‌కు నష్టం కలిగిందని చెప్పేవారు ఒక్క ఫోటో కూడా చూపించ లేకపోయారని ఆయన…

పైన ముంబై, కింద చెన్నై, మధ్యలో మనమెక్కడ ?

తమిళ ఆధిపత్యాన్నివ్యతిరేకించడంగా, తెలుగు ఆత్మాభిమానాన్ని, చారిత్రక గర్వాన్ని చాటి చెప్పడంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వ్యక్తం అయింది. ఒకే భాషా సమాజంలో అసమానతలను తెలంగాణ ఉద్యమాలు సూచించాయి. ప్రాంతీయ అంతరాలకు తెలంగాణ తెలుగును తక్కువ చూడడం కూడా ఒక సూచిక అయింది. జాతీయోద్యమంలో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ ని జాతీయతాసాధనంగా కాంగ్రెస్‌ ప్రచారం చేయడాన్ని దక్షిణాదిన,…

బాబు తో ఢీ: రేవంత్ కు పరీక్ష

మంత్రివర్గ విస్తరణ, ముఖ్యమంత్రి నిస్సహాయతనే ఎక్కువ వ్యక్తం చేసిందన్నఅభిప్రాయం కలిగించింది. కానీ, ఆ తరువాత, పాలనకు, తనకు ఇబ్బంది కలిగిస్తున్న సహచరులకు మందలింపులు అందడంతో, ఆయనలో ఆత్మస్థైర్యం పెరుగుతోందన్న సూచనా కనిపించింది. మరోవైపు కుటుంబ కలహాలు, కాళేశ్వరం కమిషన్‌ హాజరులు, ఏసీబీ కేసులు- వీటితో బిఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తెలంగాణ బిజెపి వ్యూహాత్మకమో, సామర్థ్యలోపమో, అక్కడే…

కంటతడి మరచిపోయామా? పొడిబారిపోయామా?

Have we forgotten our tears? Have we become dry?

గురువారం మిట్ట మధ్యాహ్నం, కడుపు నిండుగా మనుషుల్నీ, వాళ్ల జీవితాలనీ కలల్నీ కర్తవ్యాలనీ మోసుకుని ఎగరబోయిన లోహవిహంగం, కుప్పకూలిపోయింది. మండిపోయింది. దగ్ధ మాంసశకలాలుగా పిగిలిపోయింది. పైకి ఎగతన్నుకోలేకపోతున్నాను, శక్తి చాలడంలేదు, నేలరాలిపోతున్నాను అన్న సందేశాన్ని వదిలి నిస్సహాయంగా విస్ఫోటించింది. చావుల మీద యుద్ధానికి చదువులు పదునుపెడుతున్న, అన్నం కంచాల ముందు కూర్చున్న, రేపటి డాక్టర్ల మీద…