Category ముఖ్యాంశాలు

భారీగా కలెక్టర్ల బదిలీలు

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది.…

రైతుల అవసరాలు తీరేలా విత్తనోత్పత్తి

పూలు పండ్ల మొక్కల పెంపకంతో ఆదాయం అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల సమీక్ష సౌరవిద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుపైనా ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విత్తనోత్పత్తితో రైతుల అవసరాలు తీరాలని, పూలు పండ్ల మొక్కల పెంపకంతో ఆదాయం రాబట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ,ఇతరశాఖల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను…

కెసిఆర్‌..పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం

ప్రస్తుతం సమస్యల వలయంలో విలవిల ప్రజల్లో విశ్వాసం కోల్పోయి నైతికంగా దెబ్బతిన్న వైనం అంతా స్వయంకృతాపరాధమే (వి. రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): కెసిఆర్‌…ఈ మూడక్షరాల పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించేది. ఆయన పిలుపు నివ్వడమే ఆలస్యం వేలాదిగా జనం తరలి వొచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విడదీ యలేనంతగా ముడిపడి ఉన్న వ్యక్తి.…

ప్రియుడి మోజులో భర్త హత్య

సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య ఆదిలాబాద్‌ టీచర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : జిల్లాలో ప్రభుత్వ టీచర్‌ హత్య కేసులో సంచలన విషయాలు బయట కొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8 మంది మావోయిస్టులు మృతి..ఒక జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది…

సంస్థాగత ప్రజాస్వామ్యం అంటే…?

మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ‘సంస్థాగత ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం కాకపోవడం మన ‘‘పరిణత’’ రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న ప్రధాన లోపం. లోక్‌సభకు, రాజ్యసభకు రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండలులకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ పక్షాల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ‘అభ్యర్థుల’ను ఆయా రాజకీయ పక్షాల ‘అధిష్ఠాన వర్గాలు’ నిర్ణయిస్తు న్నాయి.…

ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన అయోధ్య వోటర్లు

తమకు వోట్లు వేయలేదనే ఆగ్రహంతో ఫైజాబాద్‌ వోటర్ల పట్ల బీజేపీ ఆక్రోశం వెళ్లగక్కుతోంది. వీరంతా హిందూ ద్రోహులని, హిందువుల వ్యతిరేకులనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారు ఈ స్థానంలో వోటమిని భరించలేకపోతన్నారు. పెద్ద అవమానంగా ఫీలవుతున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తిగా లేదు. ఓటమికి ప్రధాన కారణాలపై…

ఇదీ ‘ప్రపంచీకరణ’!!

 ఇరవై ఏళ్ల క్రితం వరకూ ప్రభుత్వం వారి ‘‘కాఫీ మండలి’’- ‘‘కాఫీ బోర్డు’’ నగరాలలో పట్టణాలలో చిల్లర దుకాణాలను నడిపేది. ఈ ‘మండలి’ దుకాణాలలో మిగిలిన చిల్లర కాఫీ దుకాణాలలో కంటే దాదాపు ఇరవై ఐదు, ముప్పయి శాతం తక్కువ ధరలకు మరింత నాణ్యమైన ‘కాఫీ’పొడిని అమ్మేవారు! మధ్య తరగతి ప్రజలు కొనేవారు.. ‘ప్రపంచీకరణ’ వొచ్చింది,…

తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట

తప్పులపై సర్కార్‌ దిద్దుబాటు చర్యలు ఇద్దరు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు…