Category శీర్షికలు

భానుడి భగభగతో.. విద్యుత్‌ ‌భారీగా వినియోగం..!

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబి క్కిరవు తున్నారు.హైదరాబాద్‌ ‌జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హైదరాబాద్‌ ‌జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా చేప్రాల 43.3 పైగా నమొదు…

అమ్మ పాటల్ని

ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో సజీవదహనం చేయబడ్డవి ఇంకా వారి…

దుఃఖ దీపం

తనువులోని రక్తాన్నంత చమురుగా పోసి ఒంట్లోని నరాలన్నింటిని వత్తులుగా పేని.. జీవితపు ఆశలను ప్రమిధలుగా చేసి.. ఎదలో రగులుతున్న కష్టాలను.. నిప్పురవ్వలుగా రాజేసి వెలిగించిన దీపం.. బలంగా వీస్తున్న గాలి తాకుల్లకు ఊగిసలాడుతూ కన్నీరు కారిస్తుంది. ఉహాలనే ఆధారాలకు వ్రేలాడుతున్న వెలుగులన్ని.. కాలం విసిరిన కత్తుల వేటకు తెగిపడుతున్నాయి. నిశీధి కమ్ముకున్న నల్లని ఆకాశంలో.. తారలన్నీవెలుగుపూలు…

శతాధిక వసంతాల ఆంధ్ర పత్రిక దిన పత్రిక

ఏప్రిల్‌ 1… ఆం‌ధ్రపత్రిక దిన పత్రిక ప్రారంభ దినం స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర వహించిన తెలుగు పత్రిక ఆంధ్ర పత్రికకు పత్రికా రంగంలో విశిష్ట స్ధానం ఉంది. తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. తరవాత కాలంలో కృష్ణా పత్రిక (1901), స్వరాజ్య (1905), ఆంధ్ర…

ఆశాగీతి

చైత్రమాసపు ఉషస్సులా జగతిని మైమరపించే వసంతభామినిలా పచ్చని చిగురుటాకుల పావడాకట్టి కబరిపై మల్లెలు సింగారించి మధుపములు మంజులనాదం చేస్తుండగా చిరునగవులొలికిస్తూ హంసలా అడుగులేస్తూ మధుమాసపు కోకిలలు పంచమంలో స్వాగతగీతం పాడుతుండగా తెలుగు వెలుగు నేనని షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ మమతానురాగాలను పెనవేసుకుంటూ అందరి ఆశలు ఈడేర్చగ వసంత సంతకం చేస్తూ శుభాలిచ్చుటకై శుభముఖంతో వేంచేస్తున్న వయ్యారిభామ…

ఉగాది పచ్చడి

చూతక ఫలం పలకరింపుతో పాతకములన్నీ పోయేనుగాక! నింబపు విరుల పుప్పొడితో గరళపుఅమ్మల స్వాంతనకాగ! ఇక్షువు గడల మధురముతో కుక్షము గోడలు శాంతములాడ! అమలక రుచుల చక్కిలింతతో జిహ్వపు చూరులు కితకితలాడ! మిరప ఘాటు రేగినవేళల్లో నవనాడుల్లో నీటి ఊటలురేగ! గుడచూర్ణము అనుపానముతో అమృతపానము కంఠమునేగ! సప్తరుచుల సమ్మేళనమే జీవితమంటూ! నవగ్రహముల గమనములే దిశా నిర్దేశంచేస్తూ! కాలంమార్పు…

సకల శుభాల ఉగాది!!

వేపచెట్టుకి ముత్యాలు పూసి తళ తళా మెరుస్తుంటే మామిడి చెట్టుపై గుండ్రటి నక్షత్రాలు నోరూరిస్తుంటే సూరీడి కళ్ళల్లో కూసింత వేసంగి తాపం సురుక్కుమంటే పాట విని వెళ్ళమని దారిలో చెట్టు చెట్టుకి ఎగిరొచ్చి కోయిల పిలుస్తోంటే శిశిరపు పత్రాల్లో హరితం ఆవిరై మట్టిలో కలిపితే వాసంతం చిగుర్లేసి హరితం ఆయువై కళకళలాడిస్తే చైత్ర శుద్ధ పాడ్యమి..ఉగాదై…

విద్య ఒక సామాజిక ఒప్పందంగా సాగాలి

సమన్వయం, సహకారం, సంఘీభావం అనబడే సూత్రాలకు బోధనా శాస్త్రం కట్టుబడి ఉండాలి. పక్షపాతం, హాని, విభజన భావాలు పాతరేయాలి. పాఠ్యాంశాల్లో పర్యావరణ సంబంధమైన, అంతర్‌ ‌సాంస్కృతిక, బహుశాఖల (మల్టీడిసిప్లెనరీ) విద్యాంశాలకు ప్రాధాన్యం కల్పించాలి. సామాజిక, విద్యా పరివర్తనాల బోధనలకు ఉపాధ్యాయున్ని కేంద్ర బిందువును చేయాలి. అసమానతలను పాతరేస్తూ అన్నివర్గాల ప్రజలకు సహకారం, సమన్వయం, సమన్యాయంస్థిరాభివృద్ధి, సమాన…

‘‘సౌభాగ్య’’… మేం సాకారం చేసిన స్వప్నం..

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే- కలకత్తా (నేటి కోల్‌కతా)లో తొలిసారిగా విద్యుత్తును పరిచయం చేస్తూ 1879లో వీధి బల్బుల వినియోగం ప్రారంభమైంది. కాగా, 2019 మార్చి 31నాటికి భారతదేశం సార్వత్రిక విద్యుద్దీకరణను పూర్తిచేసింది. తద్వారా అనూహ్య ప్రగతివైపు దూసుకెళ్లడంలో మనకు మరింతగా శక్తియుక్తులు సమకూరాయి. విద్యుద్దీకరణతో అపార అవ కాశాలు అందివస్తాయి. తద్వారా పౌరులకు సాధికారత…