Category శీర్షికలు

పోషకాహార లోపంతో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు

(సెప్టెంబర్‌ 1 ‌నుండి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారొత్సవాలు) భారతదేశంలో పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం గా మారింది.  దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 22 కోట్లమంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి…

‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు. ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం…

నిర్బంధమే ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ ఆచూకి

మయన్మార్‌ ‌ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్‌   ‌శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ ‌లీగ్‌ ‌ఫర్‌ ‌డెమోక్రసీ  అధినేత్రి  ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ  ప్రజాస్వామ్య మయన్మార్‌ ‌కోసం ఉద్యమిస్తూ  సైనిక జుంటా ప్రభుత్వంచే అన్యాయంగా   అత్యధిక కాలం పాటు నిర్బంధంలో కొనసాగారు.  ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికి కూడా నిర్బంధమే ఒక జీవితంగా  జీవిస్తున్నారు’.…

ప్రజాస్వామిక సమాజంలో టీచర్ల పాత్ర

దేశానికి ఆదర్శంగా గొప్పగా విలసిల్లాల్సిన మొదళ్ళు ఇప్పుడు నిస్తేజంగా నిస్సత్తువగా అప్రజాస్వామిక అశాస్త్రీయ మూఢ అంధ విశ్వాసాలకు కేంద్రంగా మారాయా? అన్న సందేహం కలుగుతున్నది.దేశ భవిష్యత్తును రూపొందించేవి పార్లమెంటులు కావు.. పాఠశాలలే అన్న జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మహాశయుడి ఆశయం కానీ.,  తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపొందించ బడుతుందన్న డా.డిస్‌ ‌కొదారి  మాటలన్నీ తిరగబడుతున్నట్లు కనబడుతున్నవి.1888…

‌ప్రపంచ ఆహార సంక్షోభంతో భారత ఆహార భద్రత ముడిపడి ఉందా..!

ప్రతికూల వాతావ రణాలు, యుద్ధాలతో గత ఏడాదితో పోల్చితే నేడు ప్రపంచ ఆహార పదార్థాల ధరలు 13 శాతం కరువు పెరగడంతో పేద వర్గాలు అర్థాకలితో అలమిటించే దుస్థితి ఏర్పడింది. బియ్యం, గోధుమలు, బార్లీ, వంట నూనెలు, తృణ ధాన్యాలు, పప్పుల వంటి సరుకుల ధరలు ఇటీవల పెరగడంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు…

‌శ్రమైక జీవన గీతం

నమ్మి పీఠం కట్టబెడితే నరకం జూపుతున్నరు గద్దెనెక్కింది మొదలు గద్దల్లెక్క పొడుస్తున్నరు దేశాన్ని కాసాయికరించ కసాయిలా ప్రవర్తిస్తున్నరు కులమత విద్వేషం చిమ్మి నెత్తుటేరులు పారిస్తున్నరు సకల సంపదల కొల్లగొట్టి సంపన్నుల పాల్జేస్తున్నరు బతుకులను కుప్పకూల్చి మందిరాల్ని నిర్మిస్తున్నరు గొంతెత్తే గళాల తెగ్గోస్తున్నరు పిడికిలెత్తే శక్తుల నిషేధిస్తున్నరు రణమెత్తే వీరుల నిర్బంధిస్తున్నరు ఏకంగా జన ప్రాణాల తోడేస్తున్నరు…

మళ్ళీ ‘విమోచన’ లొల్లి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్‌ ‌జమలాపురం కేశవరావు’ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరి పోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో కాంగ్రెస్‌  ‌పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…