Category శీర్షికలు

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు…

పట్టించుకోండి.. లేదా పతనం కండి

అమెరికాలో 1860 ప్రాంతంలో డిడిటి వల్ల పక్షులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయంపై సమగ్ర పరిశోధన చేసి సైలెంట్‌ ‌స్ప్రింగ్‌ (‌నిశ్శబ్ద వసంతం) అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించి దానిద్వారా మానవజనిత పర్యావరణ విధ్వంసం పై మొట్టమొదటిసారి అమెరికా నేతల ద్వారా వ్యవసాయానికి డిడిటిని వాడకాన్ని నిలిపి వేసేలా రాచల్‌ ‌కార్సన్‌…

మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?

మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా  సాగింది. ఈ మూడు పార్టీలు…

‌ప్రజలే కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాలి

 ‘‘పట్వారీ దొరగారు పరమాన్నం పెడుతుంటే పరమా త్ముడనుకున్న, ఆడుకొమ్మని ఆట బొమ్మిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న, జాలితోటి జామ పండిచ్చి తలమీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, వెండి గిన్నెల పాలు పోసిస్తే దండి గుణమని దండాలు పెట్టిన, కాటు వేసేదాకా తెలువదయ్యా కడుపులో విషమై అది పెరిగి పోయింది. గొరగాని బ్రతుకై పోయింది’’ 25…

దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ !

‘‘‌సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూనుకోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది. పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన…

దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై…!

ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య…

గడ్డి బెంబేలు

‌లంచం…అదో రోగం, సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఘోషిస్తున్న జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసే మరికొందరున్న నేటి సమాజంలో తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో రాజకీయం మకిలిపట్టిపోతోంది. స్వప్రయోజనాలు తప్ప ఏ జెండా అవసరంలేని రాజకీయాన్ని, డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని…

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

నానీల్లో మాండలిక పద పరిమళం…

తెలంగాణ భాషను, యాసను పుక్కిట పట్టి మాండలిక పదాలు, జాతీయాలపై ఎంతో  పట్టుతో కవిత్వం రాసిన కవి అన్నవరం దేవేందర్‌. ‌సులభంగా తెలంగాణ భాషా ప్రయోగాలను కవిత్వంలో కూర్చగలిగిన నిపుణత ఆయన రాసిన పలు రచనల్లో  కన్పిస్తుంది. బుడ్డపర్కలు పేరిట నానీల సంకలనాన్ని దేవేందర్‌ ‌వెలువరించారు. లోకంలోకి విసిరేసిన నిఖార్సైన వాస్తవాల అగ్నిగోళాల్లా బుడ్డపర్కలు కన్పిస్తాయి.…