– వెల్లడించిన పార్టీ నేత హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ఈనెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత హరీష్రావు వెల్లడించారు. ఈ నెల 19తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 21న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్టాన్రికి జరుగుతున్న అన్యాయంపై, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్తించనున్నారు. గోదావరి, కృష్ణ జలాలను కొల్లగొడుతున్న ఆంధప్రదేశ్ వైఖరిని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఏపీ జల దోపిడీపై ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై ఈ సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





