ఆర్థిక సంక్షోభం నుండి రాజకీయ సంక్షోభంలో శ్రీలంక
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ సంక్షోభంగామారి అది ప్రజల మహోగ్రజ్వాలల మధ్య రావణకాష్టమై మండుతున్నది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆందోళనకారులు ఆయన ఇంటితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళను అగ్నికి ఆహుతి చేశారు. అయినా వారి కోపం చల్లారలేదు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక…
